కొద్ది రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురై హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సీనియర్ నటుడు శరత్బాబు (71) ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. సోషల్మీడియాలో శరత్బాబు చనిపోయారంటూ వస్తున్న వదంతుల్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఏఐజీ ఆసుపత్రి వర్గాలు సైతం గురువారం సాయంత్రం హెల్త్ బులెటిన్ను విడుదల చేశాయి.
శరత్బాబు ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నప్పటికి, అవయవాల పనితీరు మాత్రం మెరుగుపడిందని వైద్యులు పేర్కొన్నారు. శరత్బాబు ఆరోగ్యం గురించి ఆయన కుటుంబ సభ్యులు, వైద్యులు అందించే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని ఆసుపత్రి వర్గాలు కోరాయి.