మూడేళ్ల క్రితం వచ్చిన సావిత్రి బయోపిక్ మహానటి టాలీవుడ్లో ఒక క్లాసికల్గా నిలిచిపోతుంది. తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సావిత్రి జీవితాన్ని నాగ్ అశ్విన్ అద్భుతంగా తెరకెక్కించాడు. ఎప్పటికీ మరిచిపోలేని ఓ అద్భుతమైన.. అందమైన జ్ఞాపకాన్ని బహుమతిగా నేటితరానికి అందించాడు. సావిత్రికి మరిచిపోలేని నివాళిని అర్పించాడు. ఇక కీర్తి సురేష్ అయితే నిజంగా ఆ మహానటి మళ్లీ బతికొచ్చిందా అన్నట్లు నటించింది.. ఆ నటనకు జాతీయ అవార్డు కూడా ఆమె ముందు వచ్చి వాలింది. 2018 మే 9న విడుదలైన మహానటి సినిమాకు నేటితో మూడేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంఆ చిత్రం అప్పట్లో వసూలు చేసిన మొత్తం ఎంతో చూద్దాం..
నైజాం- 11.80 కోట్లు
సీడెడ్- 2.72 కోట్లు
ఉత్తరాంధ్ర- 4 కోట్లు
ఈస్ట్- 2.52 కోట్లు
వెస్ట్- 1.61 కోట్లు
గుంటూరు- 2.15 కోట్లు
కృష్ణా- 2.38 కోట్లు
నెల్లూరు- 0.86 కోట్లు
మహానటి సినిమా అప్పట్లో రూ.20.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. అప్పట్లో అది నిజంగానే ఎక్కువగా అనిపించింది. కానీ విడుదల తర్వాత వచ్చిన కలెక్షన్స్ చూస్తే మాత్రం అంతా షాక్ అయిపోయారు. మహానటి ఫుల్ రన్ లో రూ.46.10 కోట్ల షేర్ వసూలు చేసింది. బయ్యర్లకు దాదాపు రూ.26 కోట్లకు పైగా లాభాలు తీసుకొచ్చింది. ముఖ్యంగా ఓవర్సీస్ లో అయితే 2.6 మిలియన్ వసూళ్లు రాబట్టింది మహానటి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
గ్యాంగ్ లీడర్గా ముందు ఎవరిని అనుకున్నారో తెలుసా?
అనీల్ రావిపూడి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్పై క్లారిటీ..!
క్యాలీ ఫ్లవర్ టైటిల్తో వస్తున్న సంపూ.. టీజర్ అదుర్స్
త్వరగా కోలుకోవాలని బన్నీకు స్వీట్ మెసేజ్ పంపిన చరణ్ దంపతులు
లైగర్ టీజర్ వాయిదా వేసిన నిర్మాతలు
పెళ్లి కూతురిలా ముస్తాబైన బిగ్ బాస్ బ్యూటీ.. ఫొటోలు వైరల్
సాయి పల్లవి పవర్ ఫుల్ లుక్ విడుదల