మహేశ్ బాబు (Mahesh Babu), పరశురాం (Parasuram) కాంబినేషన్లో తెరకెక్కుతున్న టాలీవుడ్ (Tollywood) చిత్రం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). కీర్తిసురేశ్ (Keerthy Suresh) ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. తాజాగా క్రేజీ చిత్రం ఎప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుంటుందనే సంబంధించిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. బార్సిలోనా షూటింగ్ షెడ్యూల్ను మహేశ్ అండ్ టీం పూర్తి చేసింది. 3 వారాల సుదీర్ఘ షెడ్యూల్లో ముఖ్యమైన టాకీ సన్నివేశాలతోపాటు మహేశ్, కీర్తిసురేశ్ ఓ పాటను చిత్రీకరించారు.
రెండు రోజుల్లో సర్కారు వారి పాట బృందం హైదరాబాద్కు తిరిగి రానుందని ఫిలింనగర్ సర్కిల్ టాక్. స్వల్ప విరామం తీసుకున్న తర్వాత నవంబర్ మొదటి వారంలో కొత్త షెడ్యూల్ను షురూ చేయనున్నారట. నవంబర్ చివరి కల్లా మొత్తం చిత్రీకరణ పూర్తవనున్నట్టు సమాచారం. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కొనసాగుతుండగా..డిసెంబర్లో మొత్తం పనులు పూర్తి కానున్నాయని టాక్.
మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్ మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఈ చిత్రం జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
RRR huge Update | అక్టోబర్ 29న రెడీగా ఉండండి..ఆర్ఆర్ఆర్ టీం ట్వీట్
Samantha art | సమంత పెయింటింగ్ ఆర్ట్ వీడియో వైరల్
RX100 Remake Trailer | ఆర్ఎక్స్ 100 రీమేక్ ట్రైలర్ అదిరింది..వీడియో
Manchi Rojulochaie Title Song| సరదాగా ‘మంచి రోజులొచ్చాయి’ టైటిల్ సాంగ్