రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు శరత్ మండవ (Sarath Mandava). రవితేజ టైటిల్ రోల్ పోషించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలైంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కాగా శరత్మండవకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఇపుడు ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
ఈ దర్శకుడు నవలా హక్కులను సొంతం చేసుకున్నాడన్న వార్త టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. షాడో నవలలకు కేరాఫ్ అడ్రస్గా ప్రముఖ డిటెక్టివ్ నవలా రచయిత వల్లూరు మధుసూదన రావు (మధుబాబు) ను పేర్కొంటారు. తాజా అప్డేట్ ఏంటంటే శరత్ మండవ రచయిత వల్లూరు మధుసూదనరావు రాసిన సుమారు 146షాడో నవలల ఐపీ రైట్స్ (Intellectual Property Rights) ను కొనుగోలు చేయడం.
ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ఈ నవలల ఆధారంగా వెబ్ సిరీస్ను తెరకెక్కించడం. ప్రస్తుతం నడుస్తున్న టాక్ ప్రకారం వెబ్ సిరీస్ ఫస్ట్ సీజన్ ప్రతీ ఎపిసోడ్కు దక్షిణాది సినీ పరిశ్రమలోని టాప్ డైరెక్టర్లు దర్శకత్వం వహించనున్నారట. ఈ వెబ్ సిరీస్ పూర్తి వివరాలపై త్వరలోనే క్లారిటీ రానుంది. శరత్ మండవ రచయిత వల్లూరుతో కలిసి దిగిన ఫొటో ఇపుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది.
Read Also : Dheemthanana Song | అల్లు శిరీష్, అనూ ఎమ్మాన్యుయేల్ ధీంతననా సాంగ్..లిరికల్ వీడియో
Read Also : Nenu Student Sir | నేను స్టూడెంట్ సర్ హీరోయిన్ ఫైనల్..లుక్ విడుదల
Read Also : Ponniyin Selvan-1 | రజినీకాంత్ సినిమాను దాటి..పొన్నియన్ సెల్వన్-1 సరికొత్త రికార్డు