నటుడు శరత్ బాబు అనారోగ్యం పాలయ్యారు. గత కొద్ది రోజులుగా ఆయన బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శరత్ బాబు ఆరోగ్యం బాగుకాకపోవడంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్ తీసుకొచ్చారు. ఇక్కడి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఐసీయూలో ఆయనకు చికిత్స జరుగుతున్నది. ప్రస్తుతం శరత్ బాబు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి దాదాపు 200 చిత్రాల్లో నటించారు శరత్ బాబు.