Santosham Awards | సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్, సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2025 కర్టెన్ రైజర్ ఈవెంట్ శనివారం సాయంత్రం హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో ఘనంగా జరిగింది. సీనియర్ నటులు మురళీ మోహన్, నిర్మాత కేఎస్ రామారావు, ఫిల్మ్ నగర్ హోసింగ్ సొసైటీ సెక్రటరీ కాజా సూర్యనారాయణ, నిర్మాత ఏడిద రాజా, రామసత్యనారాయణ స్పాన్సర్స్ సూర్య సెమ్ డైరెక్టర్స్ అనిల్, డా. సురేష్ బాబు, వీవీకే హోసింగ్ ఇండియా ప్రై వెట్ లిమిట్ అధినేత వళ్లూరు విజయకుమార్ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమానికి శ్రీ విజయ వారహి మూవీస్ సంస్థ కార్యక్రమానికి కో స్పాన్సర్గా వ్యవహరిస్తున్నది. అలాగే మ్యూజిక్ పాట్నర్గా ఆదిత్య న్యూజిక్ వ్యవహరిసున్నారు.
ఈ సందర్భంగా అతిథులు చేతుల మీదుగా సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్, సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2025 ఫంక్షన్ డేట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. కార్యక్రమంలో ఫిల్మ్ నగర్ హోసింగ్ సొసైటీ సెక్రటరీ కాజా సూర్యనారాయణ మాట్లాడుతూ – సురేష్ కొండేటితో నాకు సుదీర్ఘ కాల స్నేహం ఉంది. ఆయన మా ఇంటిని అద్దెకు తీసుకుని తన ఫ్యామిలీతో ఒక ఫ్లోర్లో ఉంటూ మరో ఫ్లోర్ లో సంతోషం మ్యాగజైన్ ఆఫీస్ పెట్టుకున్నారు. ఇప్పటికి 24 ఏళ్లుగా సక్సెస్ ఫుల్గా నడుపుతున్నారన్నారు. హైదరాబాద్ లో ఏదైనా ఈవెంట్ ఘనంగా చేయాలంటే సురేష్ చేయాలి అనేంతగా పేరు తెచ్చుకున్నారన్నారు. 24 ఏళ్లుగా సంతోషం ఈవెంట్ చేస్తున్నాం, ఆయనకు ఏం మిగులుతుందో ఏంటో తెలియదన్నారు. ఆయన సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్, సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2025 కర్టెన్ రైజర్ ఈవెంట్ కూడా సక్సెస్ ఫుల్ గా చేయాలని కోరుకుంటున్నానన్నారు.
నిర్మాత ఏడిద రాజా మాట్లాడుతూ సురేష్ కొండేటి అందరికీ మిత్రులు. ఇందాక ఇతర అతిథులు చెప్పినట్లు అందరితో బాగుంటారు. ఆయన ఏ ఈవెంట్ చేసిన వన్ మ్యాన్ షోలా ఉంటుంది. ఆయన సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్, సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2025 ఈవెంట్ ఎంతబాగా చేయబోతున్నాడు అనేది నాకూ చూడాలని ఉంది. సురేష్ కు ఆల్ ది బెస్ట్ చెబుతునన్నారు. నిర్మాత కేఎస్ రామారావు మాట్లాడుతూ – ఒక సినిమా ఈవెంట్ చేయాలంటే ప్రభుత్వాలకే పదేళ్ల టైమ్ పట్టింది. అలాంటిది ఒక్కడు, సామాన్యుడు సురేష్ కొండేటి 24 ఏళ్లుగా దిగ్విజయంగా సంతోషం అవార్డ్స్ ఫంక్షన్ చేస్తుండడం మామూలు విషయం కాదు. ఆయనకు సినిమా పరిశ్రమలో ఒక ఇబ్బంది వచ్చినప్పుడు మీడియా మిత్రులు మరింతగా అతనికి అండగా నిలబడాల్సింది. నేను ఆ టైమ్లో సురేష్ కు ఏదో ఒకటి చేయాలని ఎఫ్ఎన్ సీసీ కల్చరల్ కమిటీ అడిషనల్ చైర్మన్ గా నియమించానన్నారు. కానీ ఏ రోజు సురేష్ బాధపడడం నేను చూడలేదని, నవ్వుతూనే ఉన్నాడు. ఈ 24వ అవార్డ్స్ ఈవెంట్ కూడా సక్సెస్ ఫుల్ గా చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
సీనియర్ నటులు మురళీ మోహన్ మాట్లాడుతూ 24 ఏళ్లుగా అవార్డ్స్ ఈవెంట్ చేస్తున్న ఏకైక మ్యాగజైన్ సంతోషం. సౌత్ ఇండియాలో ఫిలింఫేర్ తప్ప మరో మేగజైన్ ఏదీ కూడా ఇంత సుదీర్ఘ కాలం అవార్డ్స్ ఫంక్షన్స్ చేయలేదు. పెద్ద పెద్ద మీడియా సంస్థలు పెట్టిన అవార్డ్స్ ఫంక్షన్స్ కూడా సక్సెస్ కాలేదు. కానీ సురేష్ ఒక్కడు ఎంతో కష్టపడి 24వ సారి ఈవెంట్ చేస్తున్నాడు. తెలంగాణలో పదేళ్ల తర్వాత గద్దర్ అవార్డ్స్ ఇచ్చారు. ఏపీలో త్వరలో ఫిలిం అవార్డ్స్ ఇవ్వబోతున్నారు. సురేష్ యూట్యూబ్ లో ఇస్తున్న ఫిలిం న్యూస్ డైలీ చూస్తాను. అవి చూస్తే నాకు ఇండస్ట్రీలోని ప్రతి అప్డేట్ తెలుస్తుందన్నారు. వీవీకే హోసింగ్ ఇండియా ప్రై వెట్ లిమిట్ అధినేత వళ్లూరు విజయకుమార్ మాట్లాడుతూ సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్, సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2025కు స్పాన్సరింగ్ చేస్తుండడం హ్యాపీగా ఉందన్నారు. నేను గతంలో చాలా ఫంక్షన్ చేశానని.. ఎక్కువ సంతృప్తిని ఈ సంతోషం ఫిలిం అవార్డ్స్ కు స్పాన్సర్ గా ఉండటం వల్లే కలుగుతోందన్నారు.
సంతోషం అవార్డ్ తీసుకున్న ప్రతి ఒక్కరిలో ఏదో సాధించామనే గొప్ప ఫీలింగ్ కలుగుతుందని.. ఎంతోమందిని ఈ అవార్డ్ తో ప్రోత్సహిస్తున్నారు సురేష్ కొండేటి అన్నారు. ఈ నెల 16న జేఆర్ సీ కన్వెన్షన్ లో జరిగే సంతోషం అవార్డ్స్ ఈవెంట్ గతంలో ఎప్పుడూ జరగనంత ఘనంగా జరగాలని, అందుకు మనమంతా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. సూర్య సెమ్ డైరెక్టర్ అనిల్ మాట్లాడుతూ ఒకే పనిని ఇన్నేళ్లుగా పట్టుదలగా చేయడం సాధారణ విజయం కాదన్నారు. సురేష్ బాబు మాట్లాడుతూ సంతోషం అవార్డ్స్ ఈవెంట్ కు స్పాన్సర్స్గా వ్యవహరించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం సురేశ్ కొండేటి మాట్లాడుతూ తాను 35 ఏళ్లుగా నేను జర్నలిస్ట్గా ఉన్నానని.. 85కు పైగా సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశానన్నారు. 16 సినిమాలు నిర్మించానని.. 600 సినిమాలకు పీఆర్ఓగా చేసినట్లు చెప్పారు. చిరంజీవి, బాలకృష్ణ, రజినీకాంత్ వంటి స్టార్స్ సినిమాలు పీఆర్ఓగా చేశానన్నారు. ఈ సందర్భంగా స్పాన్సర్స్కు కృతజ్ఞతలు తెలిపారు.