By Maduri Mattaiah
Pushpa OTT tension | అల్లు అర్జున్-సుకుమార్ కలయికలో రూపొందిన పాన్ ఇండియా చిత్రం పుష్ప. కమర్షియల్గా బ్లాక్బస్టర్గా నిలిచిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 300కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పటికీ ఈ చిత్రం మంచి వసూళ్లనే రాబడుతుంది. హిందీలో ఈ చిత్రం ఇప్పటి వరకు రూ.75 కోట్లకు పైగా వసూళ్లను సాధించి 100 కోట్ల వైపు పరుగులు తీస్తుంది. ఈ సినిమా కలెక్షన్స్ ఇప్పుడు బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తుంది. ఇలాంటి సమయంలో పుష్ప సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ నెల 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఈ నెల 7న విడుదల కాబోతున్న సినిమాలతో పాటు సంక్రాంతి పండుగకు థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలకు పుష్ప బెంగ పట్టుకుంది.
రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న ఈ తరుణంలో ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలు చూసే అవకాశం చాలా తక్కువ అనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. అంతేకాదు పుష్ప వంటి బ్లాక్బస్టర్ సినిమా రిలీజైన మూడు వారల్లోనే ఓటీటీలో రిలీజ్ అవుతుంది. దీంతో థియేటర్లో ఈ సినిమాను చూడని ప్రేక్షకులు ఓటీటీలో చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సో.. పుష్ప ఓటీటీ విడుదల థియేటర్లో విడుదలయ్యే సినిమాల వసూళ్ల విషయంలో తప్పకుండా ప్రభావం చూపుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పుష్ప 2 విషయంలో సుకుమార్కు డెడ్లైన్ పెట్టిన అల్లు అర్జున్..
పుష్ప సినిమా కోసం సుకుమార్ ముందు అనుకున్నది అల్లు అర్జున్ను కాదంట
అప్పుడూ.. ఇప్పుడూ కరోనా నుంచి తప్పించుకున్న అదృష్టవంతులు వీళ్లే..
Tollywood | ఆ విషయంలో బాలీవుడ్ను వెనక్కి నెట్టేసిన టాలీవుడ్..
Pushpa in OTT | RRR డేట్ను బ్లాక్ చేసిన పుష్ప.. ఓటీటీలో వచ్చేది అప్పుడే