హైదరాబాద్ : సేవకు మరో పేరు నర్సులు. రోగులను అమ్మలాగా ప్రేమగా చూసుకుంటారు కాబట్టే వారిని మనం నర్సమ్మా అని గౌరవంగా పిలుస్తామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి ట్విట్టర్ ద్వారా స్పందించారు. ప్రజారోగ్యాన్ని కాపాడటంలో డాక్టర్లది ఎంత ముఖ్యమైన పాత్రో.. నర్సుల పాత్ర అంతకన్నా కూడా గొప్పదన్నారు. ఈ కరోనా కష్టకాలంలో వారి సేవలు మరింత స్పష్టంగా కనిపించినట్లు తెలిపారు. ఇంటర్నేషనల్ నర్సస్ డే సందర్బంగా వారికివే కృతజ్ఞతాపూర్వక శుభాకాంక్షలు. ఈ ఒక్కరోజే కాదు ప్రతిరోజూ వారి సేవలకు మనం రుణపడి ఉందామని పేర్కొన్నారు.