Samantha | టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha) తాజాగా హిందీ వెబ్సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’ (Citadel Honey Bunny)తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ ఈ నెల 7 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం సామ్.. ఈ సిరీస్ ప్రొమోషన్స్లో పాల్గొంటూ వరుస ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ క్రమంలో వృత్తిపరమైన, వ్యక్తిగత విషయాలను పంచుకుంటోంది. తాజాగా మయోసైటిస్ గురించి ప్రస్తావించింది.
సమంత గత కొంతకాలంగా మయోసైటిస్ (Myositis) అనే అరుదైన డిసీజ్తో బాధపడుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చికిత్స తీసుకుంటూ కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో మయోసైటిస్ గురించి తాజా ఇంటర్వ్యూలో ప్రస్తావించింది. ఈ డిసీజ్ లక్షణాలు ఎప్పుడు బయటపడ్డాయో వివరించింది. సామ్ 2022లో బాలీవుడ్ యాక్షన్ స్టార్ అక్షయ్ కుమార్తో కలిసి కాఫీ విత్ కరణ్ (Koffee with Karan) షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ షోలోనే తనకు మయోసైటిస్ లక్షణాలు బయటపడ్డట్లు చెప్పుకొచ్చింది.
‘అక్షయ్ కుమార్తో కలిసి నేను కాఫీ విత్ కరణ్ షోకు వెళ్లా. నేను చాలా ప్రశాంతంగా ఉన్నానని.. కెరీర్పై మరింత దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు షోలో కరణ్తో చెప్పా. ఆ షూటింగ్లో నాకు ఉన్నట్టుండి చాలా నీరసంగా అనిపించింది. ఇక షూటింగ్ పూర్తి చేసుకొని హైదరాబాద్కు వచ్చేశా. ఆ తర్వాతి రోజు ‘ఖుషీ’ సినిమా షూటింగ్ కోసం వెళ్లా. అక్కడ చాలా ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొన్నా. ఆ షూటింగ్లో నాకు చాలా నీరసంగా అనిపించింది. శరీరం మొత్తం షట్డౌన్లోకి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. ఏం జరుగుతోంది నాకు అప్పుడు తెలియలేదు. వ్యాధిని గుర్తించడానికి చాలా సమయం పట్టింది. ఆ తర్వాత జరిగిన పరిస్థితులు అందరికీ తెలిసినవే. ప్రస్తుతం దీనికి చికిత్స తీసుకుంటున్నా. దీన్నుంచి కోలుకునేందుకు ఇంకొంత సమయం పట్టొచ్చు’ అని సామ్ వివరించారు.
Also Read..
Pushpa 2 The Rule | పుష్ప షూటింగ్ చివరి రోజు.. అల్లు అర్జున్ టీం ఫినిషింగ్ టచ్
Actor Subbaraju | పెళ్లి పీటలెక్కిన టాలీవుడ్ నటుడు సుబ్బరాజు.. వధువు ఎవరో తెలుసా..?