ఖమ్మం (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రోగనిర్ధారణ కోసం పేదలు ఇక ప్రైవేటు ల్యాబ్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, 57 రకాల పరీక్షలు ప్రభుత్వ దవాఖానల్లోని డయాగ్నస్టిక్ కేంద్రాల్లో ఉచితంగా నిర్వహించనున్నట్టు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రధాన దవాఖాన ఆవరణలో ఏర్పాటు చేసిన డయాగ్నస్టిక్ సెంటర్లను మంత్రి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోగ నిర్ధారణ కోసం నమూనాలను ఇంటి వద్దే సేకరించనున్నట్టు చెప్పారు. ఎంపీ నామా నాగేశ్వర్రావు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వర్రావు, మెచ్చా నాగేశ్వర్రావు, హరిప్రియానాయక్, రాములునాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్లు కోరం కనకయ్య, లింగాల కమల్రాజ్ తదితరులు పాల్గొన్నారు.