బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) నటిస్తోన్న తాజా చిత్రం టైగర్ 3 (Tiger 3) . మనీశ్ శర్మ డైరెక్షన్లో సల్మాన్ ఖాన్-కత్రినాకైఫ్, ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతుంది. తాజా అప్ డేట్ ప్రకారం ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక మరోవైపు ఫర్హద్ సామ్జీ (Farhad Samji) డైరెక్షన్లో కభీ ఈద్ కభీ దివాళి (Kabhi Eid Kabhi Diwali) సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన కొత్త అప్ డేట్ బయటకు వచ్చింది. మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టును సల్మాన్ మే 15న మొదలుపెట్టబోతున్నాడని బీటౌన్ సర్కిల్ లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది.
కభీ ఈద్ కభీ దివాళి షూటింగ్ను సల్మాన్ ముంబైలో షురూ చేయబోతున్నాడు. ఫర్హద్ ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులపై వర్కవుట్ చేయడం మొదలుపెట్టారు. సినిమా మొదలు పెట్టేందుకు ఎక్జయిటింగ్గా ఉంది. చిత్రయూనిట్ ప్రతినిధి ఒకరు బీటౌన్ మీడియాతో చెప్పుకొచ్చారు. సల్మాన్ ఈ చిత్రంలో నటించడమే కాదు..నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. పూజాహెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది.
సల్మాన్ ఖాన్ స్టార్డమ్ను తగ్గట్టుగా గొప్ప ఎంటర్టైనర్గా ఉండబోతుంది. యాక్షన్, కామెడీ, రొమాన్స్ కలగలిపి.. బఫేతో ప్రేక్షకులకు ఈ సినిమాను అందించబోతున్నాం. ఇక్కడి ప్రేక్షకులకు ఈద్కి షీర్ ఖుర్మా , దీపావళికి లడ్డూ అందుతాయి..డైరెక్టర్ ఫర్హద్ ఓ చిట్ చాట్ సందర్భంగా చెప్పుకొచ్చారు.