లతా మంగేష్కర్ అంత్యక్రియలు కాసేపట్లో ముంబైలోని శివాజీ పార్క్లో జరగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ.. శివాజీ పార్క్కు చేరుకొని లతా మంగేష్కర్కు నివాళులర్పించారు. ఆ తర్వాత భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్, ఆయన భార్య అంజలి.. లతా మంగేష్కర్కు నివాళులర్పించారు. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్, ఆయన భార్య కూడా లతా మంగేష్కర్కు నివాళులర్పించారు. అలాగే.. పలువురు బాలీవుడ్, రాజకీయ ప్రముఖులు శివాజీ పార్క్కు చేరుకొని లతా మంగేష్కర్ పార్థీవదేహానికి నివాళి అర్పించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, జావెద్ అక్తర్, రణ్బీర్ కపూర్ తదితరులు లతా మంగేష్కర్కు నివాళులర్పించారు.