ఉమ్మడి జిల్లాలో వేగంగా నిర్మాణాలు
నారాయణపేట, మే 15 : ప్రభుత్వం రైతులు పంటల దిగుబడిని ఆరబెట్టేందుకు తీసుకొచ్చిన పంట నూర్పిడి సిమెంట్ క ళ్లాలు (డ్రైయింగ్ ప్లాట్ ఫారం) పథకం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎంతో సత్ఫలితాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. రూరల్ డెవలప్మెంట్ స్పెషల్ కమీషనర్ బృందం సభ్యులు వివిధ మం డలాల్లో పర్యటించి కళ్లాల నిర్మాణ పనులను పరిశీలించి, సం తృప్తి వ్యక్తం చేశారు. ఇది వరకు ప్రత్యేకంగా కళ్లాలు లేకపోవడంతో పంట పొలాల్లోనే నూర్పిడి చేసే వారు, దీని వల్ల పంట లో మట్టి కలువడం వల్ల విక్రయం సమయంలో సరైన ధర రాకపోయేది. ప్రభుత్వం పంట నూర్పిడి కోసం ప్రత్యేకంగా రైతులు ముందు వస్తే వారి పంట పొలాల్లోనే సిమెంట్ కళ్లాల నిర్మాణం చేపట్టే బృహత్తర పథకాన్ని చేపట్టి, విజయవంతంగా అమలు చేస్తున్నది. ఈ పథకం కింద కళ్లా లు నిర్మించుకునేందుకు సన్న, చిన్న కారు రైతులు అ ర్హులు. సిమెంట్ కళ్లాలపై పంట దిగుబడిని ఆరబెట్ట డం వల్ల మట్టి కలిసే ఆస్కారం లేకపోవడంతోపాటు సరైన ధర లభిస్తున్నది.
రైతుల్లో మార్పు రావాలి…
రైతులు ముందుకు వస్తే వారి పంట పొలాల్లోనే కళ్లాల నిర్మాణాలను చేపట్టేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూ రు చేసి పనులు చేపడుతుండగా కొందరు రైతులు నేటికి కూడా ఇంకా రోడ్లపై పంట నూర్పిడి చేస్తున్నారు. అక్కడక్కడ ఇదే పద్ధతిని అవలంభిస్తున్నారు. దీని వల్ల తరుచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అంతెందుకు సరిగ్గా వారం రోజుల కిందట నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం వత్తుగుండ్లకు చెం దిన వెంకటేశ్ (35) బైక్పై వెళ్తుండగా బాపన్పల్లి గ్రామ సమీపంలో రోడ్డుపై ఆరబెట్టిన వడ్లపై నుంచి వెళ్తూ అదుపు తప్పి పడిపోవడంతో మృతి చెందాడు. ఇలా ఆరబెట్టిన వాటిపై అదుపు తప్పి పడిపోవడం, ఆరబెట్టిన సమయంలో రోడ్డు వెంట ఉంచి న రాళ్లను తీయకపోవడం వల్ల కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రోడ్ల వెంట పంట నూర్పిడి చేపట్టకుండా అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతో ఉంది. రైతులు సైతం ఈ పద్ధతికి స్వస్తి పలికి తమ పంట పొలాల్లోనే సిమెంట్ కళ్లాల నిర్మాణాలకు ముందుకు రావాల్సిన అవసరం ఎంతో ఉన్నది.
ఉమ్మడి జిల్లాలో టాప్ గద్వాల…
కళ్లాల నిర్మాణాల్లో ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో గద్వాల జిల్లా అత్యధికంగా కళ్లాల నిర్మాణాలను చేపట్టి టాప్ ప్లేస్లో నిలిచింది. నాగర్కర్నూల్ జిల్లాలో అత్యల్పంగా కళ్లాల నిర్మాణం ప నులు జరిగాయి. ఇక ఉమ్మడి జిల్లాలో జిల్లాల వారీగా మంజూరైన కళ్లాల సంఖ్య, మంజూరైన నిధులు, చేపట్టిన పనుల వివరాలు ఇలా ఉన్నాయి.
పంట నూర్పిడి కళ్లాల కొలతలు…
మొదటి రకం 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించుకోవచ్చు. దీని అంచనా విలువ రూ.56,000.
రెండో రకం 60 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించుకోవచ్చు. దీని అంచనా విలువ రూ.68,000.
మూడో రకం 75 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించుకోవచ్చు. దీని అంచనా విలువ 85,000.
అర్హులు…
స్వయం సహాయక సంఘంలో సభ్యులుగా ఉండి ఉండాలి.
ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు కలిగి ఉండాలి.
కళ్లాలు నిర్మించుకునే వారు ముందుగా తామే స్వయంగా పూర్తిగా డబ్బులు వెచ్చించి నిర్మించుకోవాలి.
సబ్సిడీ ఇలా…
ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్నకారు రైతులకు 100 శాతం సబ్సిడీ వర్తిస్తున్నది.
బిల్లుల చెల్లింపు…
మూడు రకాల పంట నూర్పిడి కళ్లాల నిర్మాణాలకు సంబంధించి వీటిలో ఏ రకం నిర్మించినా అందుకు సంబంధించిన డబ్బులను రెండు విడుతల్లో చెల్లించనున్నారు. నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నారు.
దరఖాస్తు చేసుకోవాలి…
పంట నూర్పిడి సిమెంట్ కళ్లాలు నిర్మించుకునే ఉద్దేశం ఉన్న రైతులు సంబంధిత క్లస్టర్ స్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో)కి లేదా ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు పట్టాదారు పాస్బుక్, బ్యాంక్ ఖాతా, ఆధార్ జిరాక్స్, ఉపాధి హామీ జాబ్ కార్డు జిరాక్స్ జత పరచాల్సి ఉంటుంది.