ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్వర్మ ‘వ్యూహం’ ‘శపథం’ అనే చిత్రాలను రూపొందిస్తున్నారు. తాజాగా ‘వ్యూహం’ చిత్ర టీజర్ను విడుదల చేశారు. ఇందులో రాజశేఖర్ రెడ్డి మరణాంతర పరిణామాలను ఆవిష్కరించారు. జగన్మోహన్ రెడ్డిని తొక్కేయాలని ప్రత్యర్థులు పన్నిన కుట్రలను కూడా చూపించారు.
‘2009 నుంచి 2014 వరకు ఏపీ రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించాం. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రంలో నటుడు అజ్మల్ సీఎం జగన్మోహన్ రెడ్డి పాత్రను పోషించారు. రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు.