RGV Vyooham | టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ramgopal varma) నిర్మించిన ‘ వ్యూహం’ సినిమాకు సెన్సార్ (Censor Board) అడ్డంకులు తొలిగాయి. హైకోర్టు (High Court) సూచనలతో సినిమాకు రెండోసారి సెన్సార్ సర్టిఫికేటును జారీ చేయడంతో ఈ సినిమాను ఈ నెల 23న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించారు. ఈ సినిమాలో ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన నాయకులను కించపరిచేవిధంగా ఉందని ఆరోపిస్తూ టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్తో (Nara Lokesh) పాటు మరికొందరు సినిమాను విడుదల చేయవద్దంటూ కోర్టులో పిటిషన్ ధాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో సినిమా విడుదలకు బ్రేక్ పడింది. చిత్రనిర్మాత, దర్శకుడు తదితరులు కోర్టును ఆశ్రయించడంతో దానికి ప్రతిగా పిటిషన్లు దాఖలు కావడంతో మరోసారి హైకోర్టు సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది. మరోసారి చిత్రాన్ని పరిశీలించి సినిమాకు సర్టిఫికేట్ను జారీ చేయవలసిందిగా ఆదేశించడంతో సెన్సార్ బోర్డు సినిమాకు యూ సర్టిఫికేట్ను జారీ చేసింది.
ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రాలు ‘వ్యూహం’, ‘శపథం’. వైఎస్ మరణం తర్వాత జగన్ జీవితంలో జరిగిన అంశాలను ఆధారంగా తీసుకుని ఈ సినిమాలను తెరకెక్కించాడు వర్మ. ఇందులో ‘వ్యూహం’ సినిమా ఫిబ్రవరి 23న విడుదల కానుండగా.. ‘శపథం’ సినిమా మార్చి మొదటివారంలో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.
Me and https://t.co/iySUKHKMHM… celebrating VYOOHAM release on Feb 23rd 💃💃💃💪💪💪🔥🔥🔥💐💐💐😎😎😎 pic.twitter.com/ENnCtyyV7N
— Ram Gopal Varma (@RGVzoomin) February 8, 2024