సోషల్ మీడియాలో వచ్చే వార్తలలో ఏది నిజం, ఏది అబద్ధం అనేది చెప్పడం చాలా కష్టం. ఈ మధ్య కాలంలో కొందరైతే బతికి ఉన్న వారిని కూడా చంపేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ సింగర్ లక్కీ అలీ కరోనాతో మృతి చెందినట్లుగా వార్తలు వచ్చాయి. ఆయన మృతి వార్తలతో అభిమానులు తీవ్ర మనోవేదనకు గురి అయ్యారు. ప్రముఖులు నివాళులు అర్పించారు. ఈ విషయాలు లక్కీ అలీ చెంతకు చేరడంతో ఆయన తన సోషల్ మీడియా ద్వారా స్పందించారు.
హాయ్ ఎవ్రీవన్ నాపై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. నేను బతికే ఉన్నాను. హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాను. నేను ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నాను తప్ప మరెక్కడికి వెళ్లలేదు . మీరు అంతా కూడా సేఫ్ గా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈ విపత్కర సమయంలో దేవుడు మన అందరిని కూడా కాపాడుతాడని ఆశిద్దాం అంటూ పేర్కొన్నాడు లక్కీ అలీ . ఏదేమైన ఇలా బ్రతికున్న వారిని చంపడం దారుణం అంటూ పలువురు నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.