RC15 | రామ్ చరణ్, శంకర్ సినిమా షూటింగ్ కొన్ని రోజులుగా పరిస్థితుల ప్రభావంతో ఆగిపోయినప్పటికీ ఈ చిత్రం గురించి సోషల్ మీడియాలో వార్తలు మాత్రం ఆగడం లేదు. ఈ సినిమా ఇప్పటికే 2 షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాను వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి 2023 సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు శంకర్. అత్యంత భారీ బడ్జెట్తో నిర్మాత దిల్ రాజు తన ప్రొడక్షన్ హౌస్లో 50వ సినిమాగా RC 15 నిర్మిస్తున్నాడు. రామ్ చరణ్ ఇమేజ్కు తగ్గట్లు అద్భుతమైన పొలిటికల్ స్టోరీ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. దీన్ని ఒకే ఒక్కడు సీక్వెల్ అంటున్నారు. కానీ దీనిపై చిత్ర యూనిట్ ఏమీ మాట్లాడటం లేదు. రాజకీయ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది అంటూ విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఇదంతా ఇలా ఉంటే ఈ సినిమా కోసం 250 కోట్ల బడ్జెట్ దిల్ రాజు కేటాయించినట్లు తెలుస్తోంది. దానికి మించకుండా సినిమా ప్లాన్ చేసుకోవాలని దర్శకుడు శంకర్కు నిర్మాత చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శంకర్ కూడా బడ్జెట్ ప్లానింగ్ సిద్ధం చేస్తున్నాడు.
కేవలం కాన్సెప్ట్ పోస్టర్ కోసం కోసం ఏకంగా 1.73 కోట్ల ఖర్చు పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ పోస్టర్లో సినిమాకు పనిచేస్తున్న కాస్ట్ అండ్ క్రూ అందరూ ఉన్నారు. కియారా అద్వానీ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. మరోవైపు శ్రీకాంత్, సునీల్, జయరామ్, అంజలి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. కేవలం కాన్సెప్ట్ పోస్టర్ కోసమే రూ.1.73 కోట్లు ఖర్చు పెట్టేస్తే.. సినిమా అంత తీయడానికి శంకర్ ఎంత బడ్జెట్ పెట్టిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే కేవలం ఒక్క పాట కోసం రూ.24 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది నిజంగా ఒక సంచలనం.
రూ. 24 కోట్లతో దిల్ రాజు ఒక సినిమా నిర్మిస్తాడు. అలాంటిది ఇప్పుడు ఒక్క పాట కోసం ఖర్చు పెడుతున్నారు. ఇదివరకు ఒక యాక్షన్ సన్నివేశం కోసం శంకర్ ఏకంగా 70 కోట్లు ఖర్చు పెట్టిస్తున్నట్టు ప్రచారం జరిగింది. 7 నిమిషాల పాటు జరిగే ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఏకంగా 70 కోట్లు ఖర్చు పెడుతున్నారని వార్తలు వినిపించాయి. ఇలా ఒక్క పాట కోసం 24 కోట్లు, యాక్షన్ సీన్ కోసం 70 కోట్లు ఖర్చు పెట్టిస్తుండటంతో దిల్ రాజును సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్లు.
ఇది వరకు ఒక్క సినిమా కోసం కూడా 70 కోట్ల బడ్జెట్ పెట్టలేదు దిల్ రాజు. కానీ ఇప్పుడు తమిళ డైరెక్టర్ శంకర్తో జతకట్టిన తర్వాత ఒక్క సీక్వెన్స్ కోసమే 70 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుందంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. మీరు ఎవరితో పెట్టుకున్నారో ఇప్పటికైనా మీకు అర్థమవుతుందా రాజు గారు అంటూ మీమ్స్ వస్తున్నాయి. సినిమా అయిపోయే లోపు ఈజీగా 250 కోట్లు కాదు కదా దానికి మరో 50 కోట్లు అదనంగా శంకర్ ఖర్చు పెట్టిస్తాడని ట్రేడ్ వర్గాల నుంచి వార్తలు బాగానే వస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
మెగా కుటుంబం అల్లుడిని దూరం పెట్టడానికి కారణం అదేనా..?
7 నిమిషాలు.. 70 కోట్లు.. చరణ్ కోసం శంకర్ బీభత్సం..
దిల్ రాజు ఇన్నాళ్లకు బడ్జెట్ బోర్డర్ దాటేస్తున్నాడుగా.. అన్నీ భారీ సినిమాలే..