డ్రగ్స్, మనీ లాండరింగ్ (Tollywood Drugs case) సంబంధిత కేసుల్లో ఈడీ అధికారులు టాలీవుడ్ (Tollywood) సెలబ్రిటీల విచారణ కొనసాగిస్తున్నారు. ఇవాళ హీరో రవితేజ (Raviteja) తోపాటు డ్రైవర్ శ్రీనివాస్ ను ఈడీ విచారించింది. కొద్దిసేపటి క్రితమే రవితేజ విచారణ ముగిసింది. రవితేజను సుమారు 6 గంటలపాటు ప్రశ్నించారు అధికారులు. మనీ ల్యాండరింగ్ కోణంలో రవితేజ బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలించారు. అనుమానాస్పదంగా అనిపించిన లావాదేవీలపై ఆరా తీశారు.
డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ తో రవితేజకు ఏమైనా పరిచయం ఉందా..? ఆయన ఖాతాలకు పెద్ద మొత్తంలో నగదు ఏమైనా పంపించారా..? అనే అంశాలతోపాటు ఎఫ్ 3 క్లబ్ గురించి పలు విషయాలు అడిగినట్టు తెలుస్తోంది. రవితేజ విచారణకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ కేసులో ఇప్పటికే రానాను విచారించిన అధికారులు డ్రగ్ సరఫరా దారుడు కెల్విన్తో ఉన్న సంబంధాలు, ఎఫ్ క్లబ్లో నిర్వహించే పార్టీలు, అక్కడి పార్టీలకు వచ్చేవారు?..కెల్విన్తో రానా ఎప్పుడైనా నగదు లావాదేవీలు జరిపారా..? అనే కోణంలో విచారించారు.
ఈ కేసులో మొదట పూరీ జగన్నాథ్ ను విచారించిన అధికారులు ఆ తర్వాత ఛార్మీ, రకుల్ ప్రీత్ సింగ్, నందును విచారించారు. కాగా..ఈ నెల 13న నవదీప్, ఎఫ్క్లబ్ పబ్ జనరల్ మేనేజర్, 17న తనీష్, 22న తరుణ్ ఈడీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు.
Sonu Sood: మరో ప్రాణాన్ని నిలబెట్టిన సోనూసూద్.. బిగ్ డే అంటూ ట్వీట్
Tiger 3 | సల్మాన్, కత్రినా పాట చాలా కాస్లీ గురూ..బడ్జెట్ ఎంతంటే..?
Vijay Deverakonda | ముంబైతో పోలిస్తే నేను సోమరి హైదరాబాదీని