ఇండియన్ సినీ హిస్టరీలో బయోపిక్ల (Biopics) హవా కొత్తేమీ కాదు. ఇప్పటికే చాలా మంది బయోపిక్స్ తెరపై సందడి చేశాయి. బయోపిక్స్ లో నటించి మంచి ఫేం సంపాదించిన హీరోహీరోయిన్లు కూడా ఉన్నారు. బయోగ్రాఫికల్ డ్రామా (biographical dramas)ల్లో నటించేందుకు ఇటీవల కాలంలో చాలా మంది ముందుకొస్తున్నారు. కొత్తదనంతో కూడిన కథలను చేసేందుకు రెడీగా ఉన్న హీరోల్లో ఒకడు రవితేజ.
ఈ క్రాక్ స్టార్ ఇపుడు పాపులర్ దొంగ టైగర్ నాగేశ్వర్ రావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం టైగర్ నాగేశ్వర్ రావు (Tiger Nageswara Rao)లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ముందే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi),దగ్గరకు వెళ్లిందట. హైదరాబాద్లో ఏప్రిల్ 2న జరిగిన టైగర్ నాగేశ్వర్ రావు లాంఛింగ్ ఈవెంట్లో ఈ విషయాన్ని చెప్పాడు చిరు. ఇప్పటికే చిరు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ సైరాలో నటించాడు.
ఈ నేపథ్యంలో డైరెక్టర్ వంశీ లాక్ డౌన్ టైంలో ఈ కథను పట్టుకుని తన దగ్గరకు వచ్చాడని చెప్పిన చిరంజీవి..ఇతర కమిట్ మెంట్స్ వల్ల ఆ కథను రిజెక్ట్ చేసినట్టు తెలిపాడు. ఆ తర్వాత రవితేజ దగ్గరకు స్కిప్ట్ వెళ్లిన వెంటనే ఒకే చెప్పేశాడు. తన సోదరుడు రవితేజ ఈ సినిమా చేయడం సంతోషంగా ఉందన్నాడు చిరు. దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త చిత్రాలను తెరకెక్కించాడు వంశీ. 1970లలో స్టూవర్ట్పురంలో అత్యంత ధైర్యవంతుడైన దొంగగా పాపులర్ అయ్యాడు టైగర్ నాగేశ్వర్ రావు. ఈ చిత్రంలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.