కన్నడ సొగసరి రష్మిక మందన్న ప్రస్తుతం పలు భారీ చిత్రాలతో బిజీగా ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈ భామ ఓ చారిత్రక చిత్రంలో నటించబోతున్నట్లు తెలిసింది. కెరీర్లో తొలిసారి ఆమె ఈ తరహా కథాంశంలో భాగం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. విక్కీ కౌశల్ కథానాయకుడిగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి ‘చావా’ అనే టైటిల్ను ఖరారు చేశారు.
ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడు శంభాజీ మహారాజ్ వీరోచిత జీవితగాథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ఇందులో రష్మిక మందన్న కథానాయికగా ఖరారైంది. శంభాజీ భార్యగా ఆమె పాత్ర కథాగమనంలో చాలా కీలకంగా ఉంటుందని చెబుతున్నారు. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో మడాక్ ఫిల్మ్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ప్రస్తుతం రష్మిక మందన్న ‘పుష్ప-2’ ‘యానిమల్’ ‘రెయిన్బో’ చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్నది.