కన్నడ కస్తూరి రష్మిక మందన్న తన సంపాదనలో రియల్ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తుందని తెలిసింది. దక్షిణాదితో పాటు హిందీ చిత్రసీమలో కూడా ఈ భామ తిరుగులేని ఫాలోయింగ్ను సంపాదించుకుంది. ముఖ్యంగా ‘పుష్ప’..ఇటీవల విడుదలైన ‘యానిమల్’ చిత్రాలు జాతీయ స్థాయిలో ఆమె స్థానాన్ని సుస్థిరం చేశాయి. ఈ నేపథ్యంలో ఈ భామ ఒక్కో సినిమాకు నాలుగు కోట్ల వరకు రెమ్యునరేషన్ను అందుకుంటున్నదని సమాచారం.
సినిమాలతో పాటు బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా ఈ అమ్మడు భారీ మొత్తంతో ఆర్జిస్తున్నది. బెంగళూరులో రష్మిక కొనుగోలు చేసిన బంగ్లా దాదాపు 10కోట్ల విలువ ఉంటుందని తెలిసింది. అలాగే ముంబయిలో ఓ విలాసవంతమైన అపార్ట్మెంట్ ఇటీవలే ఖరీదు చేసిందని సమాచారం. వీటితో పాటు గోవా, కూర్గ్, హైదరాబాద్లో పలు అపార్ట్మెంట్లను రష్మిక కొనుగోలు చేసిందని చెబుతున్నారు. వ్యాపారం నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రావడంతో రష్మిక మందన్న పెట్టుబడుల విషయంలో తెలివిగా నిర్ణయాలు తీసుకుంటున్నదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.