Rashmika mandanna | సినీరంగంలో నటీమణులకు గుర్తింపు రావడానికి చాలా సమయమే పడుతుంది. అదే కొందరు నటీమణులు మాత్రం ఒకటీ రెండు సినిమాలతోనే స్టార్ స్టేటస్ను సంపాదించుకుంటారు. అలా ఓవర్ నైట్ స్టార్ అయిన కథానాయిక రష్మిక మందన్న. కన్నడలో ‘కిరిక్ పార్టీ’ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ప్రస్తుతం సౌత్ టూ నార్త్ వరకు స్టార్ హీరోలతో కలిసి నటిస్తుంది. ఇక ఈమె క్రేజ్ స్టార్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా ఉంది. వైవిధ్య భరిత కథలను ఎంచుకుంటూ తన అందం అభినయంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది ఈ కన్నడ సోయగం. మంగళవారం రష్మిక పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో పాటు సినీప్రముఖులు సోషల్ మీడియాలో బర్త్డే విషెస్ను తెలియజేస్తున్నారు.
రష్మిక మందన్న 1996 ఏప్రిల్ 5న కర్ణాటక రాష్ట్రంలోని కొడగు జిల్లాలోని విరాజ్ పేట గ్రామంలో జన్మించింది. సైకాలజీ జర్నలిజంలో బ్యాచ్లర్ డిగ్రీని పూర్తి చేసింది. మైసూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్ కాలేజ్లో ఎమ్ఎస్ పూర్తీ చేసుకుంది. ఆ తరువాత మోడలింగ్పై దృష్టి పెట్టింది. మొదటసారి ఈమె ‘క్లీన్ అండ్ క్లియ’ర్ అనే ఫేస్ క్రీమ్ సంస్థకు మోడలింగ్ చేసింది. అదే సమయంలో 2013లో క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ ఆఫ్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. దాంతో ఈ సంస్థ రష్మికను ‘క్లీన్ అండ్ క్లియర్’కు బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది.
ఆ తర్వాత పలు ఇంటర్వూలలో రష్మిక తనకు సినిమాలలో నటించాలని ఉంది అని తెలిపింది. అదే సమయంలో ‘కిరిక్ పార్టీ’ సినిమా కోసం దర్శకుడు రిషబ్ శెట్టి ఆడిషన్లను జరపుతున్నాడు.అప్పుడే రష్మిక ఇంటర్వూలను చూసిన రిషబ్ ‘కిరిక్ పార్టీ’ సినిమాలో ఒక హీరోయిన్ పాత్ర కోసం రష్మికను సంప్రదించాడట. రష్మిక కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. 2016 డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది. అంతేకాకుండా రష్మిక నటనకు ప్రశంసలు వెల్లువెత్తాయి. రష్మిక మొదటి సినిమానే ఘన విజయం సాధించడంతో కన్నడలో అవకాశాలు క్యూ కట్టాయి. ఈ క్రమంలోనే పునీత్ రాజ్కుమార్తో ‘అంజనీపుత్ర’, గణేష్తో ‘ఛమక్’ వంటి సినిమాలలో నటించి హ్యట్రిక్ హిట్లను సాధించింది.
నాగశౌర్య హీరోగా నటించిన ‘ఛలో’ సినిమాతో రష్మిక తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. కిరిక్పార్టీ సినిమాను చూసి రష్మికను ఛలో సినిమాలో తీసుకున్నాం అని వెంకీ పలు ఇంటర్వూలలో తెలిపాడు. ఈ చిత్రం కూడా మంచి విజయం సాధించింది. దీని తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి ‘గీతా గోవిందం’ సినిమాలో నటించింది. ఈ చిత్రంతో రష్మిక క్రేజ్ విపరీతంగా పెరిగింది. 15కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం 75కోట్ల షేర్ కలెక్షన్లను సాధించి ట్రిపుల్ బ్లాక్ బస్టర్గా నిలిచింది.
ఆ తర్వాత వచ్చిన ‘దేవదాసు’ నిరాశపరుచగా, ‘డియర్ కామ్రేడ్’ కమర్షియల్గా సక్సెస్ కాకపోయినా మంచి ప్రశంసలు అందుకుంది. ఇక ఆ తర్వాత వరుసగా ‘సరిలేరు నీకెవ్వరూ’, ‘భీష్మ’ వంటి వరుస హిట్టు సినిమాలతో స్టార్ హీరోయిన్ జాబితాలో చోటు దక్కించుకుంది. కార్తి నటించిన ‘సుల్తాన్’ సినిమాతో రష్మిక తమిళంలో ఎంట్రీ ఇచ్చింది. ఇక గతేడాది వచ్చిన ‘పుష్ప’ సినిమాతో రష్మిక క్రేజ్ పాన్ ఇండియా లెవల్లో అమాంతం పెరిగింది. ఈ చిత్ర విజయంతో బాలీవుడ్లో వరుసగా అవకాశాలు వస్తున్నాయి.
సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించిన ‘మిషన్ మజ్నూ’తో రష్మిక బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. ఇదివరకే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 10న విడుదల కానుంది. దీనితో పాటుగా బిగ్బీ అమితాబ్తో కలిసి ‘గుడ్బాయ్’ సినిమాలో నటించింది. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో అమితాబ్బచ్చన్, రష్మికకు తండ్రిగా నటిస్తున్నాడు. ఇక తెలుగులో ‘పుష్ప పార్ట్-2’లో నటిస్తుంది. తాజాగా సందీప్రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘యానిమల్’ సినిమాలో రణ్బీర్ కపూర్కు జోడీగా నటుస్తున్నట్లు ఇటీవలే మేకర్స్ ప్రకటించారు.
Read also:
Balakrishna-Raviteja | బాలకృష్ణ-రవితేజ మల్టీస్టారర్..?
Ranbir-Alia Bhatt | రణ్బీర్-ఆలియా బ్యాచ్లర్ పార్టీ.. సీక్రెట్ గెస్ట్లు వీరే?
Chiranjeevi | సుకుమార్ యాడ్ కోసం చిరు అంత పారితోషికాన్ని తీసుకున్నాడా?
Samantha | బాలీవుడ్ స్టార్ హీరోతో జతకట్టనున్న సమంత.. పారితోషికం విషయంలో నో కాంప్రమైజ్