Chiranjeevi Remunaration | సినిమారంగంలో నటీనటులు ఒకవైపు సినిమాలను చేస్తూనే మరో వైపు కమర్షియల్ యాడ్స్లో నటిస్తూ రెండు చేతుల నిండా సంపాదిస్తుంటారు. మంచి క్రేజ్ ఉన్నప్పుడే యాడ్స్లో నటించే అవకాశాలు వస్తుంటాయి. ఈ అవకాశాన్ని వాడుకొని సినీతారలు భారీగా రెమ్యునరేషన్లు డిమాండ్ చేస్తూ ఉంటారు. కేవలం రెండు నుంచి మూడు రోజుల్లో ఉండే యాడ్స్ కోట్లలో రెమ్యునరేషన్లు అందుకుంటారు. ఇటీవలే మహేష్బాబు, మౌంటెన్ డ్యూ యాడ్ కోసం దాదాపు 12కోట్ల వరకు పారితోషికం అందుకున్నట్లు సమాచారం.
ఇక రౌడి స్టార్ విజయ్ దేవరకొండ థమ్సప్ యాడ్ కోసం 10కోట్ల వరకు పారితోషికం అందుకున్నాడట. ఇక ఇటీవలే చిరంజీవి రియల్ ఎస్టేట్ యాడ్లో నటించిన విషయం తెలిసిందే. క్రియేటీవ్ జీనియస్ సుకుమార్ ఈ యాడ్కు దర్శకత్వం వహించాడు. ఖుష్భూ సుందర్, అనసూయలు చిరుతో కలిసి నటించారు. ప్రస్తుతం యూడ్యూబ్లో ఈ యాడ్ మిలియన్ల వ్యూస్ను సాధిస్తుంది. చిరు గతంలో థమ్సప్ యాడ్లో నటించాడు. అప్పటినుంచి మరో యాడ్ ఫిలింలో నటించలేదు. అయితే థమ్సప్ యాడ్కు అప్పట్లోనే బాలీవుడ్ హీరోల కంటే అధికంగా అందుకున్నాడు. మరి ఇప్పుడు ఎంత తీసుకున్నాడు అని ప్రేక్షకుల్లో చర్చలు నడుస్తున్నాయి. అయితే చిరు ఈ రియల్ ఎస్టేట్ యాడ్ కోసం 7కోట్ల పారితోషికాన్ని తీసుకున్నాడని టాలీవుడ్ వర్గాల్లో సమాచారం. ప్రస్తుతం చిరుకు కూడా ఇప్పుడున్న హీరోలతో సమానంగా క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ దృష్ట్యా చిరుకు ఇంత మొత్తం పారితోషికం ఇచ్చారట.
చిరు ప్రస్తుతం నటించిన ‘ఆచార్య’ ఏప్రిల్ 28న విడుదల కానుంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్చరణ్ కీలకపాత్రలో నటించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఈ చిత్ర ట్రైలర్ను శ్రీరామ నవమీ సందర్భంగా ఏప్రిల్ 10న విడుదల చేయనున్నారు. దీంతో పాటుగా ‘గాడ్ఫాదర్’, ‘భోళా శంకర్’ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి. వీటితో పాటుగా మరో రెండు సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి.