విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమాతను ప్రముఖ సినీ నటుడు రాంచరణ్, ఆచార్య సినిమా దర్శకుడు కొరటాల శివ దర్శించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, తనయుడు రాంచరణ్ల ఆధ్వర్యంలో నిర్మించిన ఆచార్య చిత్రం ఈనెల 29న విడుదల కానున్న నేపథ్యంలో హీరో, దర్శకుడు అమ్మవారిని దర్శించుకున్నారు. రాంచరణ్ రాకను తెలుసుకున్న మెగా అభిమానులు అతడిని చూసేందుకు ఎయిర్పోర్టుతో సహ ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.
దుర్గగుడి అంతరాలయంలో జై చరణ్ అంటూ నినాదాలు చేయడంతో ఆలయంలో ఇలాంటి సరికాదని చిత్ర బృందం సభ్యులు వారించారు. వీరి రాక సందర్భంగా భక్తులు ఇబ్బందులు పడ్డారు. దుర్గ గుడి దర్శనం అనంతరం చరణ్, కొరటాల శివ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు.