Diwali Party | వెలుగుల పండుగ దీపావళి (Diwali 2023)కి మరో వారం రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో ఈ పండుగకు అంతా సిద్ధమవుతున్నారు. ఇక సెలబ్రిటీలైతే ఇప్పటికే ప్రత్యేక విందు పార్టీలు నిర్వహించి సందడి చేస్తున్నారు. తాజాగా దీపావళి సందర్భంగా నిర్వహించిన ఓ పార్టీలో టాలీవుడ్ స్టార్స్ రామ్చరణ్, మహేశ్ బాబు తన కుటుంబంతో కలిసి సందడి చేశారు.
దీపావళి పర్వదినాన్ని పురష్కరించుకొని మేఘా ఇంజినీరింగ్ కళాశాల అధినేత మేఘా కృష్ణారెడ్డి, మేఘా సుధారెడ్డి ప్రత్యేక విందు పార్టీ నిర్వహించారు. ఈ పార్టీకి పలువురు స్టార్స్ హాజరై సందడి చేశారు. టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan) తన భార్య ఉపాసనతో కలిసి ఈ పార్టీలో మెరిశారు. అదేవిధంగా మరోస్టార్ జంట మహేశ్ బాబు (Mahesh Babu)-నమ్రత కూడా హాజరయ్యారు. ఫొటోలకు ఫోజులిస్తూ సందడి చేశారు. పార్టీకి సంబంధించిన ఫొటోలను నమ్రత సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ స్టార్స్ జంట ఒకే ఫ్రేమ్లో కనిపిండచంతో మెగా, ఘట్టమనేని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ఇదే పార్టీకి టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్, మంచు విష్ణు భార్య విరానిక కూడా హాజరయ్యారు.
ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఇద్దరు అగ్ర హీరోలు తమ తదుపరి సినిమాల షూటింగుల్లో బిజీగా ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ చిత్రంలో చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్తో కలిసి ‘గుంటూరు కారం’ సినిమాతో మహేశ్ బిజీగా గడుపుతున్నారు. ఈ రెండు చిత్రాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
Also Read..
Rashmika Mandanna | రష్మిక డీప్ఫేక్ వీడియో.. కేంద్ర ఐటీ విభాగం ఏమందంటే..?
Mohammad Azharuddin | హెచ్సీఏలో భారీ అవినీతి.. అజారుద్దీన్పై నాలుగు కేసులు నమోదు