రాజ్యసభ సభ్యులు సంతోష్కుమార్ (MP Santosh Kumar) చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (Green Indian Challenge) కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ప్రముఖ జర్నలిస్ట్, యాంకర్ స్వప్న (Swapna) విసిరిన ఛాలెంజ్ను స్వీకరించిన ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) ఇవాళ శ్రీనగర్ కాలనీలోని పబ్లిక్ పార్కులో మొక్కలు నాటారు.
రాంగోపాల్ వర్మతో కలిసి మొక్కలు నాటే ప్రోగ్రామ్లో పాల్గొన్న ఫొటోలను స్వప్న ట్విటర్ లో షేర్ చేశారు. ఎంపీ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరించి మొక్కలు నాటిన వర్మకు ధన్యవాదాలు అని స్వప్న ట్వీట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మొక్కలు నాటారు. @RGVzoomin @MPsantoshtrs #GreenIndiaChallenge pic.twitter.com/5Dw2DqkTwT
— Namasthe Telangana (@ntdailyonline) March 20, 2022
Thank you @RGVzoomin for planting a tree and contributing to Green India Challenge led by @MPsantoshtrs .. pic.twitter.com/Adnxh8Cvd0
— Swapna (@swapnajourno) March 20, 2022