అభయ్ నవీన్, అన్వేష్ మైఖేల్, పవన్ రమేశ్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధానపాత్రధారులుగా నటించిన చిత్రం ‘రాక్షసకావ్యం’. శ్రీమాన్ కీర్తి దర్శకుడు. రాము రెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మాతలు. ఈ నెల 13న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘ బడ్జెట్ పరంగా చిన్న సినిమా అయినా కంటెంట్ పరంగా ఇది చాలా పెద్ద సినిమా. పురాణంలోని జయవిజయుల పాత్రల్ని స్ఫూర్తిగా తీసుకొని తయారు చేసుకున్న కథ ఇది. కలియుగంలో వాళ్లు జన్మిస్తే ఎలా ఉంటుందనే ఊహతో ఈ కథ రాసుకున్నాను. ఇందులో మంచి సందేశం కూడా ఉంటుంది. అందరికీ నచ్చుతుందని నా నమ్మకం’ అని దర్శకుడు అన్నారు. ఇంకా చిత్ర యూనిట్ సభ్యులందరూ మాట్లాడారు.