ఇంటర్నెట్లో అత్యంత వివాదాస్పద నటి రాఖీ సావంత్. ఇటీవల ఓ వీడియోతో మళ్లీ వైరల్ అయ్యింది. ఆ వీడియో తన ఫ్యాన్స్ను ఆందోళనకు గురిచేసింది. ఇటీవల మేజర్ శస్త్రచికిత్స చేయించుకున్న రాఖీ సావంత్ దవాఖానలో తన పరిస్థితిని వీడియో తీసి సోషల్మీడియాలో షేర్చేసింది.
గర్భాశయంలో కణతి వల్ల తీవ్రంగా కడుపునొప్పి వచ్చిందని, దీంతో శస్త్రచికిత్స చేయించుకోక తప్పలేదని రాఖీ సావంత్ తెలిపింది. శస్త్రచికిత్స తర్వాత తాను చాలా బలహీనంగా ఉన్నానని, క్రిటికేర్ హాస్పిటల్ జుహులో 4 గంటల పాటు శస్త్రచికిత్స జరిగిందని వెల్లడించింది. వీడియోలో రాఖీ బాయ్ఫ్రెండ్ ఆదిల్ ఖాన్ దుర్రానీ కనిపించారు. దవాఖానలో రాఖీకి తోడుగా ఉంటూ సపర్యలు చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఆమె త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ఆకాంక్షించారు.