భారతీయ ప్రేక్షక లోకం ఎదురుచూస్తున్న మోస్ట్ అవెయిటెడ్ చిత్రాల్లో ఒకటి మేజర్ (Major). 26/11 ముంబై ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్ని క్రిష్ణన్ జీవితం ఆధారంగా వస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ (Tollywood) హీరో అడివి శేష్ (Adivi Sesh) టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. శశి కిరణ్ టిక్కా (Sashi Kiran Tikka) డైరెక్ట్ చేస్తున్నాడు. అడివి శేష్ అండ్ డైరెక్టర్ కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)ను మర్యాదపూర్వకంగా కలిశారు.
మేజర్ సినిమా ట్రైలర్ను రాజ్నాథ్ వీక్షించారు. ఇండియా గ్రేట్ హీరో కథను తెరకెక్కిస్తున్న డైరెక్టర్ శశికరణ్, అడివి శేష్కు శుభాకాంక్షలు తెలియజేశారు. త్వరలోనే మేకర్స్ రాజ్నాథ్ సింగ్ కుటుంబసభ్యుల కోసం మేజర్ స్పెషల్ స్క్రీనింగ్ వేయనున్నారు. గూఢచారి మూవీ తర్వాత శోభితా ధూళిపాళ మరోసారి అడివి శేష్కు జోడీగా నటిస్తోంది. సయీ మంజ్రేకర్, ప్రకాశ్ రాజ్, రేవతి, అనీష్ కురువిల్లా, మురళీ శర్మ కీలక పాత్రలు పోషించారు.
తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో 2022 జూన్ 3న గ్రాండ్గా థియేటర్లలో విడుదల కాబోతుంది. సోనీ పిక్చర్స్ ఇండియా, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ+ఎస్ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. స్టార్ హీరో మహేశ్ బాబు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నాడు.
Jaan Doonga Desh Nahi – जान दूँगा देश नहीं 🇮🇳#Major squad with Shri Rajnath Singh, Minister of Defence of India.#MajorTrailer on May 9 💥#MajorTheFilm#MajorOnJune3rd @AdiviSesh @sobhitaD @saieemmanjrekar @GMBents @urstrulyMahesh @AplusSMovies @SashiTikka @majorthefilm pic.twitter.com/PfmDMUGSnf
— Sony Pictures Films India (@sonypicsfilmsin) May 6, 2022