సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ‘సేనాపతి’ పేరుతో ఓ వెబ్సినిమా చేయబోతున్నారు. చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల, విష్ణుప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ సాధినేని దర్శకుడు. ‘ఆహా’ ఓటీటీ ద్వారా త్వరలో విడుదలకానుంది. ఈ సినిమామోషన్ పోస్టర్ను ఆదివారం హీరో సాయిధరమ్తేజ్ విడుదలచేశారు. ‘యాక్షన్ థ్రిల్లర్ అంశాలకు నాటకీయతను మేళవించి రూపొందిస్తున్న చిత్రమిది. సేనాపతి ఎవరు?అతడి కథేమిటన్నది ఆకట్టుకుంటుంది. ఇందులో మూర్తి అనే పాత్రలో రాజేంద్రప్రసాద్ కనిపిస్తారు. మునుపెన్నడూ కనిపించనటువంటి కొత్త పాత్రను ఆయన పోషిస్తున్నారు. తాతామనవళ్ల అనుబంధం ఆకట్టుకుంటుంది’ అని చిత్రబృందం తెలిపింది. నరేష్ అగస్త్య, జ్ఞానేశ్వర్ కాండ్రేంగుల, రాకేందుమౌళి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.