కొన్నాళ్లుగా మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ (Sharwanand). ఈ యాక్టర్ ప్రస్తుతం పీపుల్స్ మీడియా (Peoples Media) నిర్మాణంలో కృష్ణచైతన్య (Krishna Chaitanya)తో సినిమా చేస్తున్న సంగతి తె లిసిందే. ఈ సినిమాలో కొత్తగా కనిపించేందుకు మేకోవర్ మార్చుకునే పనిలో ఉన్నాడట శర్వానంద్. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. రాశీఖన్నా (Raashi Khanna) తొలిసారి శర్వానంద్కు జోడీగా నటించబోతుందని టాలీవుడ్ సర్కిల్ తాజా సమాచారం.
శర్వానంద్ అనుకున్న ప్రకారం మేకోవర్ పూర్తయిన వెంటనే షూటింగ్ మొదలు కానుందట. కృష్ణచైతన్య ఇప్పటికే నితిన్తో పవర్ పేట్ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు..అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ ప్రాజెక్టు రద్దయింది. ఇపుడిదే చిత్రాన్ని లేదా దానికి అనుబంధంగా ఉండే స్టోరీని పెట్టి శర్వానంద్తో సినిమా చేస్తున్నాడని టాక్ నడుస్తోంది. మరోవైపు రాశీఖన్నా ప్రస్తుతం మారుతి-గోపీచంద్ కాంబినేషన్లో వస్తున్న పక్కా కమర్షియల్లో నటిస్తోంది.
Read Also : Suriya | రెమ్యునరేషన్ తీసుకోని సూర్య..కారణం చెప్పిన స్టార్ డైరెక్టర్..!
Read Also : Kinnerasani | నేరుగా ఓటీటీలోకి మెగాస్టార్ అల్లుడి సినిమా?
Read Also : #NBK108 | రూట్ మార్చబోతున్న అనిల్ రావిపూడి.. బాలకృష్ణతో అలాంటి సినిమా చేయనున్నాడట!