Puneetha Raj kumar James Movie Pre release Business |దివంగత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన చివరి సినిమా జేమ్స్. చేతన్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 17న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 వేల స్క్రీన్స్లో విడుదల అవుతుంది. ఈ సినిమా కోసం కేవలం తమిళ ప్రేక్షకులు మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండియన్ అభిమానులు అందరూ వెయిట్ చేస్తున్నారు. దానికి ప్రత్యేక కారణం పునీత్ చివరి సినిమా కావడం. ఇప్పటికే కర్ణాటకలో న భూతో న భవిష్యతి అనే స్థాయిలో ఈ సినిమా విడుదల అవుతుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా కూడా రికార్డులు క్రియేట్ చేశాడు పవర్ స్టార్. కేవలం కర్ణాటకలోనే రూ.65 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.
కేజీఎఫ్ మినహా మరే సినిమాకు ఇది సాధ్యం కాలేదు. కానీ పునీత్ చివరి సినిమా కావడంతో డిస్ట్రిబ్యూటర్లు కూడా ధైర్యం చేశారు. మరోవైపు మార్చి 17 నుంచి 24 వరకు కర్ణాటకలోని అన్ని థియేటర్లలో జేమ్స్ సినిమా మాత్రమే కనిపించనుంది. దీనికి పోటీగా మరో సినిమాను విడుదల చేయకూడదని డిస్ట్రిబ్యూటర్లు ముందుగానే నిర్ణయించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు 250 థియేటర్లలో జేమ్స్ విడుదలవుతుంది. రాధే శ్యామ్ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో కచ్చితంగా జేమ్స్ క్యాష్ చేసుకునేలా కనిపిస్తుంది. సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా పునీత్ రాజ్ కుమార్పై ఉన్న సాఫ్ట్ కార్నర్తో కచ్చితంగా మంచి కలెక్షన్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. హిందీలో కూడా దాదాపు 300 థియేటర్లలో విడుదల అవుతుంది జేమ్స్.
తమిళం, మలయాళంలోనూ చాలా మంచి రిలీజ్ డేట్ దొరికింది. ఈ సినిమాకు ఎటు చూసుకున్న కూడా ఎమోషనల్ గానే ఈ సినిమాకు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా కనిపిస్తున్నారు. చేతన్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రియా ఆనంద్ హీరోయిన్గా నటించింది. టాలీవుడ్ హీరో శ్రీకాంత్ విలన్గా నటించాడు.
కన్నడనాట మొదలైన పునీత్ రాజ్ కుమార్ దండయాత్ర..”
RRR Movie | రాజమౌళి ట్రిపుల్ ఆర్ మూవీ ఓటీటీలో ఎప్పుడు రాబోతుంది..?
Sai dharam tej | డబుల్ ఇంపాక్ట్తో రీ ఎంట్రీ ఇస్తున్న సాయి ధరమ్ తేజ్..
పెళ్లి సందD సినిమాకు జాక్ పాట్.. అదనంగా మరో 5 కోట్లు..