Sai dharam tej new look | తెలుగు ఇండస్ట్రీలో ఎవరూ ఊహించని పరిణామం సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ ముందు చిన్నదే అనుకున్న తర్వాత అది ఎంత పెద్ద అనేది అందరికీ అర్థమైంది ఆ ప్రమాదం తర్వాత దాదాపు 45 రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా ఉన్న ఈయన.. దీపావళి సందర్భంగా తీసిన ఫోటోలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో చాలా సన్నగా ఉన్నాడు తేజ్. ఆ తర్వాత మెల్ల మెల్లగా బరువు పెరుగుతూ వచ్చాడు. ఈ మధ్య రెగ్యులర్ గా కొత్తకొత్త ఫోటోషూట్స్ చేస్తూ అభిమానులకు దర్శనమిస్తున్నాడు సాయి ధరమ్ తేజ్. అందులో మునుపటి లుక్లోకి వచ్చి ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చాడు.
తాజాగా మరోసారి సాయి ధరమ్ తేజ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సారి ఫోటోలు మరింత స్పష్టంగా ఉన్నాయి. ఇది చూసిన తర్వాత సాయి ఈజ్ బ్యాక్ అంటూ ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే ఫోటోలు చూస్తుంటేనే సాయి పూర్తిగా కోలుకున్నాడు అనే విషయం అర్థమవుతుంది. పూర్తిగా కోలుకున్న సాయి ధరమ్ తేజ్ను చూసి అభిమానులు కూడా సంతోషిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్ 10న వినాయక చవితి రోజు ఈయనకు ఆక్సిడెంట్ అయిన సంగతి తెలిసిందే. కేబుల్ బ్రిడ్జి సమీపంలో ఈయన నడుపుతున్న బైక్.. రోడ్డు మీద ఇసుక కారణంగా స్కిడ్ అయ్యి కింద పడటంతో తీవ్ర గాయాల పాలయ్యాడు.
దాదాపు 45 రోజుల తర్వాత ఈయన కోలుకుని ఇంటికి వచ్చాడు. 2022 ఏప్రిల్ లో షూటింగ్ చేయడానికి రెడీ అవుతున్నాడు సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం రెండు సినిమాలు కమిట్ అయ్యాడు మెగా మేనల్లుడు. అందులో ఒకటి పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్ చేయబోతున్నాడు. తమిళంలో మంచి విజయం సాధించిన వినోదయ సితం రీమేక్. దీనితో పాటు మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు సాయి తేజ్. ఈ రెండు సినిమాలతో కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు.