ప్రియాంకా చోప్రా..పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్ లో కెరీర్ను మొదలుపెట్టి..హాలీవుడ్లోనూ పాగా వేసేందుకు ఫోకస్ పెట్టింది. అమెరికన్ సింగర్ నిక్ జోనస్ ప్రేమలో పడి..డేటింగ్ చేసింది. ఆ తర్వాత 2018లో ప్రియుడు నిక్ను పెండ్లి చేసుకున్న అనంతరం అమెరికాకు పరిమితమైపోయింది ప్రియాంక. ప్రియాంక అండ్ ఫ్యామిలీ కూడా నిక్ ఫ్యామిలీతో కలిసిపోయింది. అయితే నిక్ కంటే ముందు ప్రియాంక ఓ వ్యక్తిని పెండ్లి చేసుకోవాలని ఆమె కుటుంబసభ్యులు అనుకున్నారట.
ఇంతకీ ఎవరా వ్యక్తి అని ఆలోచిస్తున్నారా..? దేవోంకే దేవ్..మహదేవ్ సీరియల్తో మంచి గుర్తింపు తెచ్చుకున్న మోహిత్ రైనా. కొన్నేళ్ల క్రితం జూమ్ టీవీలో ప్రియాంక మాట్లాడుతూ..తన ఆంటీ మోహిత్ రైనాతో తన మ్యాచ్ ఫిక్స్ చేయాలని చూసిందని చెప్పింది. మోహిత్ రైనా యువకుడు, నిజాయితీ, మంచి గుణం కలిగిన వ్యక్తి, మంచి నటుడు కావడంతో అతనితో నా పెండ్లి అయితే బాగుంటుందని ఆంటీ భావించిందని చెప్పుకొచ్చింది ప్రియాంకా.