కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ప్రభావంతో ఇప్పటికే థియేటర్ల వ్యవస్థ కుదేలైంది. ఈ రెండు వేవ్లు కొంత శాంతించడంతో మధ్యలో థియేటర్లు (Cinema theatres)మళ్లీ రీ ఓపెన్ అయి మనుపటిలా కాకున్నా కొంతలో కొంత సినిమాల బిజినెస్ పెరిగిందనే చెప్పాలి. అయితే ఇపుడు కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ (Omicron)సెగ మళ్లీ పెద్ద సినిమాలకు తాకుతోంది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే టాలీవుడ్ (Prithviraj)లో రాబోతున్న పాన్ ఇండియా చిత్రాలు భీమ్లా నాయక్, ఆర్ఆర్ఆర్ విడుదల తేదీలను మార్చేసుకున్నాయి.
ఇపుడు ఒమిక్రాన్ సెగ బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar)సినిమాకు కూడా తాకింది. అక్షయ్ కుమార్ నటిస్తోన్న భారీ ప్రాజెక్టు ‘పృథ్విరాజ్ ‘(Prithviraj). చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ జనవరి 21న విడుదల కావాల్సి ఉంది. అయితే ఒమిక్రాన్ కేసుల పెరుగుదల నేపథ్యంలో సినిమా విడుదల వాయిదా పడ్డది.
దేశవ్యాప్తంగా సినీ లవర్స్ ను ఆకట్టుకునే బ్లాక్బస్టర్ మీ దగ్గర ఉన్నప్పుడు..మీ భారీ ప్రాజెక్టుతో గేమ్ ఆడలేరు. పృథ్విరాజ్ జనాలను తిరిగి థియేటర్లకు తీసుకురావడంలో సహాయపడుతుంది. అయితే ఈ ప్రయోజనం నెరవేరని టైంలో సినిమాను విడుదల చేయలేం. బిజినెస్ పరంగా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టే సినిమాపై రాజీ పడటం సమంజసం కాదు..అని యశ్ రాజ్ ఫిలిమ్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. చివరి నిమిషం వరకూ కేసుల పరిస్థితిని గమనిస్తూ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటోంది యశ్రాజ్ ఫిలింస్.