ప్రస్తుతం ఉన్న యువ దర్శకుల్లో వైవిధ్యమైన సినిమాలు తీస్తూ.. ప్రేక్షకులని మెప్పిస్తున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. తొలి చిత్రం ‘అ!’తోనే అతను ఆడియన్స్ని మెప్పించాడు. ఓ డిఫరెంట్ జోనర్లో ఈ సినిమాను రూపొందించి తన సత్తా నిరూపించుకున్నాడు. ఆ తర్వాత రాజశేఖర్ హీరోగా అతను తెరకెక్కించిన ‘కల్కీ’ చేశాడు. ఈ సినిమా కూడా మంచి హిట్గా నిలిచింది. ఈ సినిమాలో స్క్రీన్ప్లేతో పాటు విజువల్స్, మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆ తర్వాత ప్రశాంత్ తెరకెక్కించిన చిత్రం ‘జాంబీ రెడ్డి’ కూడా మంచి టాకే సంపాదించింది. తెలుగులో జాంబీ జోనర్లో వచ్చిన తొలి చిత్రం కావడంతో ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త థ్రిల్ అందించింది.
ప్రశాంత్ వర్మ డెబ్యూ చిత్రం అ!కు సీక్వెల్ ఉంటుందిని అప్పట్లో ప్రకటన చేశాడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు దాని ఊసే లేదు. అసలు అ2 చిత్రం ఎందుకు ఆగిపోయింది అనే దానిపై తాజాగా వివరణ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ. అ2 స్క్రిప్ట్ ఎప్పుడో పూర్తైంది. దీనిని ఓ బాలీవుడ్ స్టార్ తో పాన్ ఇండియా మూవీగా రూపొందించాలని అనుకున్నాను. అంతే ఓకే అయిన తర్వాత ఆ బాలీవుడ్ స్టార్ డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోతున్నా అని అన్నారు. దీంతో ‘అ2’ సినిమా వెనక్కి వెళ్లిందని తెలియజేశాడు ప్రశాంత్ వర్మ.