హైదరాబాద్ : గత కొంతకాలంగా ఏపీలో టికెట్ల వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం విడుదలవగా.. అంతకు ముందు ప్రభుత్వం థియేటర్లకు నోటీసులు జారీ చేసి, అదనపు షోలు నిర్వహించకుండా ఆదేశాలు జారీ చేసిన విషయం విధితమే. పవన్ కల్యాణ్ను దెబ్బకొట్టేందుకు భీమ్లా నాయక్ రిలీజ్ను దృష్టిలో పెట్టుకొని టికెట్ ధరలకు సంబంధించిన జీవోను విడుదల చేయలేదంటూ పలువురు విమర్శలు గుప్పించారు.
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా పరిశ్రమతో సర్కారు వ్యవహరిస్తున్న తీరును తప్పుపడుతూ ట్వీట్ చేశారు. ‘సృజన.. సాంకేతికత మేళవించిన సినిమా రంగంపై అధికార దుర్వినియోగం, ఆధిపత్య ధోరణి ఏంటి?. చిత్రమ పరిశ్రమను క్షోభపెడుతూ మేమే ప్రోత్సహిస్తున్నామంటే నమ్మాలా?. ఏవైనా ఉంటే రాజకీయ క్షేత్రంలో చేసుకోవాలి. కక్ష సాధింపులు బాక్సాఫీస్ దగ్గర ఎందుకు? ఎంతగా ఇబ్బందిపెట్టినా ప్రేక్షకుల ఆదరాభిమానాలకు ఎవరూ అడ్డుకట్ట వేయలేరు’ అంటూ ఆగ్రం వ్యక్తం చేశారు.
#BheemlaNayak .. #GovtofAndhrapradesh please put an end to this onslaught..let cinema thrive 🙏🏻🙏🏻🙏🏻#JustAsking pic.twitter.com/eZxpVYYZbI
— Prakash Raj (@prakashraaj) February 27, 2022