సూపర్ స్టార్ కృష్ణ పార్థీవదేహానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. కృష్ణ మరణంతో తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయిన మహేశ్ బాబు కుటుంబసభ్యులను సినీ ఇండస్ట్రీకి చెందిన దర్శకులు, నిర్మాతలు, నటీనటులు పరామర్శిస్తున్నారు.
కృష్ణ భౌతిక కాయానికి స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) నివాళులర్పించిన అనంతరం మహేశ్ బాబు (Mahesh Babu)ను ఓదార్చారు. మహేశ్ బాబును వ్యక్తిగతంగా కలుసుకుని కొద్దిసేపు మాట్లాడాడు ప్రభాస్. నానక్రాంగూడలోని నివాసానికి కొంత ఆలస్యంగా చేరుకున్న ప్రభాస్.. మహేశ్ను పలు విషయాలు అడిగి తెలుసుకున్నాడు.
ఇటీవలే ప్రభాస్ కూడా తన పెద్దనాన్న కృష్ణంరాజును కోల్పోయిన విషయం తెలిసిందే. పెద్ద దిక్కును కోల్పోయిన ఈ ఇద్దరు స్టార్ హీరోలు మాట్లాడుకుంటున్న స్టిల్స్ నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. వీరితోపాటు అక్కినేని అఖిల్ కూడా ఉన్నాడు.
Read Also : Super star Krishna | కృష్ణ మరణంతో ట్రైలర్ వాయిదా వేసిన దిల్ రాజు టీం..!
Read Also : Suprerstar Krishna | కృష్ణ చివరి సినిమా ఇదే.. ఒకే హీరోయిన్తో 43 సినిమాలు..
Read Also : Super Star Krishna | తెలుగులో స్పై జోనర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్.. సూపర్ స్టార్