బాహుబలి సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్తోపాటు అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్ (Prabhas). మూవీ లవర్స్ అంతా బాహుబలి స్టార్ ప్రభాస్ అంటూ ఆకాశానికెత్తేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత రిలీజైన సాహో (Saaho) చిత్రం సౌత్లో డీలా పడిపోయినా..ఉత్తరాదిన మాత్రం మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. మార్కెట్ పరంగా ప్రభాస్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఇక ఈ ఏడాది విడుదలైన రాధేశ్యామ్ (Radhe Shyam) బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టినా ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
రెమ్యునరేషన్ (Remuneration) విషయంలో కూడా టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచిపోయాడు. అప్పటివరకు రూ.75 కోట్లు పారితోషికం తీసుకున్న ప్రభాస్ సలార్ కు సంతకం చేసే నాటికి రూ.100 కోట్లకు పెంచేసి హాట్ టాపిక్గా మారిపోయాడు. తాజాగా ప్రభాస్ మరోసారి రెమ్యునరేషన్ పెంచాడన్న వార్త ఫిలింనగర్ సర్కిల్లో జోరుగా వినిపిస్తోంది. లేటెస్ట్ టాక్ ప్రకారం ప్రభాస్ పారితోషికాన్ని రూ.120 కోట్లకు పెంచాడట.
షూటింగ్ పూర్తి చేసుకున్న ఆదిపురుష్ సినిమాకు ఇంత భారీ మొత్తాన్ని ఛార్జ్ చేశాడన్న వార్త హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా బిజినెస్ భారీ స్థాయిలో ఉండటం ఖాయమన్న ధీమాతోనే ప్రభాస్ రెమ్యునరేషన్ను పెంచేశాడట. ఒకవేళ ఈ క్రేజీ అప్ డేట్ నిజమైతే..ఇంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న వన్ ఓన్లీ సౌతిండియా స్టార్ ప్రభాస్ అవనున్నాడు.
Read Also : ఆదిపురుష్ తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్న ప్రభాస్..?
Read Also : Ajith Road Trip | బీఎండబ్ల్యూ బైక్పై రోడ్ ట్రిప్..ట్రెండింగ్లో అజిత్ స్టిల్స్
Read Also : Genelia D’Souza | జెనీలియా గ్రాండ్ రీఎంట్రీ..క్రేజీ సినిమా వివరాలివే..!