యాదాద్రి భువనగిరి : ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో యాదాద్రిలో బుధవారం ఉదయం 10 గంటల నుంచే లాక్ డౌన్ పక్కాగా అమలవుతోంది. ఉదయం 5 గంటలకు నారసింహుని ఆలయాన్ని తెరచిన అర్చకులు స్వామివారి నిత్య పూజలను అంతరంగీకంగా జరిపారు. లాక్ డౌన్ దృష్ట్యా ఆలయానికి భక్తుల అనుమతిని నిరాకరించారు.
స్వామి దర్శనం, భక్తులచే జరుపబడే ఆర్జిత సేవలు, లడ్డూ ప్రసాద విక్రయాలు నిలిపివేసిన నేపథ్యంలో ఆలయ అధికారులు టికెట్ల విక్రయాలను నిలిపివేశారు. ఈ నెల 21వ తేదీ వరకు స్వామి వారి దర్శనం అనుమతిని ఇవ్వబోమని ఆలయ ఈవో గీత తెలిపారు.
ఇవి కూడా చదవండి..
సహృదయతను చాటుకున్న ఏసీపీ ఉమేందర్
సెల్ ఫోన్ కోసం.. 40 కిలోమీటర్ల సైకిల్ సవారీ
కరోనాతో మేడారం పూజారి భార్య మృతి
నర్సుల సేవలు వెలకట్టలేనివి : మంత్రి సత్యవతి రాథోడ్
తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పెద్ది
సేవకు మరో రూపం నర్సులు : మంత్రి శ్రీనివాస్ గౌడ్