పాన్ ఇండియాస్టార్ హీరో ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం సలార్. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్న ఈ మూవీలో శృతిహాసన్ కథానాయిక. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం కాగా..కోవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో నిలిచిపోయింది. అయితే ఆదిపురుష్ సినిమా కూడా చేయాల్సిన సమయం రావడంతో ప్రభాస్ త్వరలో షూటింగ్ ను మొదలుపెట్టాలని సలార్ టీంకు సూచించాడట. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్లో సలార్ నెక్ట్స్ షెడ్యూల్ చేపట్టనున్నారు.
ఈ షెడ్యూల్ లో లీడ్ యాక్టర్లు పాల్గొననున్నారు. జులై రెండో వారంలో చిత్రీకరణ షురూ కానున్నట్టు టాక్. సెప్టెంబర్ వరకు మేజర్ పార్టు షూట్ పూర్తి చేయాలని ప్రభాస్ భావిస్తున్నాడట. ఆ తర్వాత ఆదిపురుష్ టీంతో జాయిన్ కానున్నాడు. ప్రభాస్ -పూజాహెగ్డే నటించిన రాధేశ్యామ్ ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా..లాక్డౌన్ ఎఫెక్ట్ తో నిలిచిపోయింది.
ఇవి కూడా చదవండి..
గోపీచంద్ స్టైలిష్ ‘పక్కా కమర్షియల్’ లుక్ అదిరింది
పవన్ కల్యాణ్ కోసం శ్రీకాంత్ అడ్డాల స్టోరీ..?
‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’..ఈ సారి చైనాపై దండయాత్ర..!
మహేష్ బాబు ఓల్డ్ ఫ్యామిలీ ఫోటో వైరల్
పవన్కల్యాణ్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్ డేట్..!
షూటింగ్ కు టైం ఫిక్స్ చేయమన్న చిరంజీవి..!