Adipurush | బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఒక్క సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ అయిపోయాడు. అప్పట్నుంచి ఆయనకు వరుసపెట్టి అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగైదు సినిమాలు కూడా ఉన్నాయి. వీటిలో భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమా గురించి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ ఎలా ఉండబోతున్నాడో చూడాలని ఆశగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ను థ్రిల్కు గురిచేస్తుంది.
ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న ఆది పురుష్ చిత్రాన్ని టీ సిరీస్ సంస్థలో భూషణ్ కుమార్ నిర్మిన్నాడు. సీతగా కృతి సనన్ నటిస్తోంది. రావణాసురుడి పాత్రను సైఫ్ అలీఖాన్ పోషిస్తున్నారు. రామాయణ ఇతిహాస నేపథ్యంతో విజువల్ వండర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా గ్రాఫిక్స్ కోసం దాదాపు 300 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇక ఈ సినిమా కోసం ప్రభాస్ 100 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ చిత్ర షూటింగ్ కోసం ఏళ్లు గడుస్తుందని అనుకుంటే.. ఆశ్చర్యంగా 103 రోజుల్లోనే కంప్లీట్ చేశాడు ఓంరౌత్. ప్రస్తుతం గ్రాఫిక్ వర్క్ నడుస్తున్న ఈ చిత్రాన్ని భారతీయ భాషలతో పాటు ఇంగ్లిష్లోనూ విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదే విషయమై డిస్నీ స్టూడియోస్తో మేకర్స్ చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఈ సంప్రదింపులు సఫలం అయితే ఆదిపురుష్ సినిమా హాలీవుడ్లో కూడా విడుదలవుతుంది. ఒకవేళ ఇదే జరిగితే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ నుంచి పాన్ వరల్డ్ స్టార్ అయిపోతాడేమో.!
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
Radhe shyam | ప్రభాస్ రాధే శ్యామ్ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా..?
Kriti Sanon | ఎవరో చెప్పారని మారడానికి నేనేమైనా ప్లాస్టిక్ బొమ్మనా.. ప్రభాస్ హీరోయిన్ సీరియస్
చిరంజీవి కాదన్న కథతో ప్రభాస్.. కామెడీ చేయబోతున్న డార్లింగ్..
సలార్ నుంచి సరికొత్త అప్డేట్.. కొత్త పోస్టర్ రిలీజ్ చేసిన ప్రశాంత్ నీల్
Prabhas: ప్రభాస్కి సిగ్గు ఎక్కువ.. వీలున్నప్పుడల్లా డిన్నర్ పార్టీ ఇస్తాడన్న కృతి