Prabhas 25 | Spirit | ప్రభాస్ ఇప్పుడు తెలుగు హీరో కాదు.. పాన్ ఇండియన్ స్టార్. అందుకే ఈయన ఏం చేసినా కూడా అందరి కళ్లు దానిపైనే ఉంటాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఈయన తీసుకుంటున్న నిర్ణయాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ముఖ్యంగా దర్శక నిర్మాతలను షాక్కు గురిచేస్తున్నాయి. ప్రభాస్కు ఇప్పుడు అన్ని భాషల్లోనూ మార్కెట్ ఉంది. బాహుబలి సినిమాతో వచ్చిన ఇమేజ్ను నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. బాహుబలికే కాదు తన మిగిలిన సినిమాలకు కూడా ఆ స్థాయి మార్కెట్ ఉందని నిరూపించుకునే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ప్రభాస్ చేసిన సాహో సినిమా హిందీలో కూడా 150 కోట్లకు పైగా వసూలు చేసి ప్రభాస్ రేంజ్ను చూపించింది. ఈ సినిమా తెలుగులో ఫ్లాప్ అయినా కూడా హిందీలో హిట్ అయింది. కలెక్షన్లు కూడా బాగానే రావడంతో ప్రభాస్కు ధైర్యం వచ్చింది.
ప్రభాస్తో సినిమాలు చేస్తున్న నిర్మాతలకు కూడా మరింత నమ్మకం పెరిగింది. అందుకే ఇప్పుడు ఈయన చేస్తున్న సినిమాల బడ్జెట్ చూస్తుంటే కళ్లు బైర్లు గమ్మేస్తున్నాయి. దీంతో ఒక్కో సినిమాకు నిర్మాతలు వందల కోట్ల బడ్జెట్ అయినా పెడుతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ కమిటైన రాబోయే 5 సినిమాల బడ్జెట్ 1000 కోట్లు దాటిపోయిందంటే ఈయన రేంజ్ అర్థం చేసుకోవచ్చు. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న రాధే శ్యామ్ బడ్జెట్ దాదాపు 140 కోట్లు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమా తర్వాత సలార్ బడ్జెట్ కూడా 140 కోట్లకు పైగానే ఉండబోతుంది. కేజీఎఫ్ లాంటి సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా ఇది. పాన్ ఇండియన్ స్థాయిలో 150 కోట్లకు తగ్గకుండా ఈ సినిమా రానుంది.
మరోవైపు ఆది పురుష్ పౌరాణిక చిత్రం. అందులో రాముడిగా నటించబోతున్నాడు ప్రభాస్. ఈ చిత్రం కోసం 300 కోట్ల బడ్జెట్ ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఓం రౌత్ ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఆ తర్వాత నాగ్ అశ్విన్, ప్రభాస్ సినిమా కోసం 400 కోట్లు ఖర్చు పెట్టబోతున్నట్లు నిర్మాత అశ్వినీదత్ ప్రకటించాడు. ఈ సినిమా కథ కూడా అలాగే ఉంటుందని.. అందుకే అంత బడ్జెట్ అయినా ధైర్యం చేస్తున్నామని చెప్పుకొచ్చాడు ఈ నిర్మాత. అలా మొత్తానికి ప్రభాస్ నటిస్తున్న రాబోయే 4 సినిమాల బడ్జెట్ దాదాపు 1000 కోట్లు ఉండబోతుంది. ఈ నాలుగు సినిమాలను కూడా రెండేళ్లలో పూర్తి చేయాలని చూస్తున్నాడు. తాజాగా ప్రభాస్ 25 వ సినిమాను ఒప్పుకున్నాడు. మిగిలిన హీరోలు 25వ సినిమా అంటే పెద్ద దర్శకుడితో చేయాలనుకుంటారు కానీ ప్రభాస్ మాత్రం సందీప్ రెడ్డి వంగా తో ఫిక్స్ అయ్యాడు. ఈ సినిమాకు స్పిరిట్ ( spirit ) అనే టైటిల్ ఖరారు చేశారు.
స్పిరిట్ ( spirit ) సినిమాను కూడా 200 కోట్లకు పైగానే బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ నిర్మిస్తున్నారు. మూడేళ్లలో 5 సినిమాలు విడుదల చేయాలనేది ముందు నుంచి ప్రభాస్ వేసుకున్న ప్లాన్. అంటే ఈ లెక్కన 2024 వరకు కూడా ప్రభాస్ ఎవరికీ దొరకడన్నమాట. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రభాస్ ఓ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నాడు. ప్రస్తుతం కమిటైన 5 సినిమాలు పూర్తైన తర్వాత ఈయన ఓ ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండాలని చూస్తున్నాడు. ఎలాంటి టెన్షన్స్ లేకుండా.. సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేయాలని చూస్తున్నాడు. ఎందుకంటే కొన్నేళ్లుగా రెస్ట్ లేకుండా పని చేస్తున్నాడు ప్రభాస్. పైగా పాన్ ఇండియన్ సినిమాల కోసం మరింత ఎక్కువ కష్టపడుతున్నాడు. అందుకే ఈ బ్రేక్ కావాలంటున్నాడు ఈయన. సందీప్ రెడ్డి వంగా తో కమిటైన స్పిరిట్ తర్వాత ఈ బ్రేక్ తీసుకోనున్నాడు యంగ్ రెబల్ స్టార్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Samantha | ఎన్టీఆర్ తో సమంత సందడి ..క్రేజీ అప్ డేట్..!
Prabhas 25 | సందీప్ రెడ్డి వంగాతో ప్రభాస్ 25వ సినిమా
Samantha: పెళ్లి రోజు పోస్ట్ పెట్టిన సమంత.. అందులో ఏం చెప్పిందంటే..!
Samantha | అమ్మో సమంత అంత రెమ్యునరేషన్ తీసుకుంటుందా?
Manchu Vishnu | సొంత డబ్బులతో ‘మా’ భవనం..మంచు విష్ణు మేనిఫెస్టో ఇదే
Pawan kalyan | సాయి ధరమ్ తేజ్ దర్శకుడికి పవన్ కళ్యాణ్ బంపర్ ఆఫర్
షారూఖ్ పార్టీలో బాలీవుడ్ స్టార్ల భార్యలు డ్రగ్స్ తీసుకున్నారు: షెర్లిన్ చోప్రా