బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే. ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ను కొట్టివేసిన ముంబై కోర్టు ఈ నెల 7వ తేదీ వరకు అతడిని ఎన్సీబీ కస్టడీలోనే ఉంచాలని ఆదేశించింది. అయితే ఇప్పుడు బీటౌన్లో కొందరు షారూఖ్కి మద్దతిస్తుండగా, మరి కొందరు పాత సంఘటనలు గుర్తు చేస్తూ విమర్శిస్తున్నారు.
ఇటీవల రాజ్కుంద్రా అశ్లీల కుంభకోణం కేసులో బాలీవుడ్ నటి, మోడల్ షెర్లిన్ చోప్రా సంచలన కామెంట్స్ చేయగా, ఇప్పుడు డ్రగ్స్ గురించి మాట్లాడిన పాత వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది . ఇందులో కోల్కతా నైట్రైడర్స్కి యజమానిగా ఉన్న షారూఖ్.. ఓ పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీలో నేను డ్యాన్స్ చేసి అలసిపోయి వాష్ రూంకి వెళ్లాను. అక్కడ బాలీవుడ్ స్టార్ల భార్యలు .. అద్దాల ముందు నిల్చుని తెల్లని పౌడర్ పీలుస్తున్నారు.
డ్రగ్స్ తీసుకుంటున్నారనే విషయం తెలుసుకొని నేను షాక్ అయ్యాను. ఆ సమయంలో షారూఖ్, అతని స్నేహితులకి గుడ్ బై చెప్పి వెళ్లాను. బాలీవుడ్లో జరిగే పార్టీలు ఇలా ఉంటాయా అని ఆరోజే ఆలోచించాను అంటూ షెర్లిన్ తన వీడియోలో తెలియజేసింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ చేసిన కామెంట్స్ సంచనలంగా మారాయి.