టాలీవుడ్ సినీ జనాలు ఎక్జయిటింగ్గా ఎదురుచూస్తున్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్టుల్లో ఒకటి ఎస్ఎస్ఎంబీ 28 (SSMB28). మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ షురూ కాగా.. కొత్త షెడ్యూల్ అప్డేట్ ప్రారంభంపై మాత్రం ఏదో ఒక న్యూస్ చక్కర్లు కొడుతూనే ఉంది. ఇదిలా ఉంటే మహేశ్ బాబు (MaheshBabu) తాజా సినిమాలో టాలెంటెడ్ యాక్టర్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడన్న వార్త ఇపుడు ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
ఇంతకీ ఆ నటుడెవరనే కదా మీ డౌటు. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్. ఒక్కడు సినిమాలో మహేశ్ బాబుతో పోటీపడే విలన్గా, దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాల్లో మహేశ్ తండ్రిగా నటించాడు ప్రకాశ్ రాజ్. మరి ఈ స్టార్ యాక్టర్ ఈ సారి మాత్రం తాత పాత్రలో కనిపించబోతున్నట్టు ఓ వార్త ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే ప్రకాశ్ రాజ్ ఇందులో మహేశ్బాబుకు తాతగా కనిపించబోతున్నాడా..? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
అతడు, ఖలేజా తర్వాత మహేశ్ బాబు, త్రివిక్రమ్, ప్రకాశ్ రాజ్ కాంబోలో వస్తున్న మూడో సినిమా కావడం విశేషం. మరోవైపు ఎస్ఎస్ఎంబీ 28 మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో కూడా హ్యాట్రిక్ సినిమాగా రాబోతుంది ఎస్ఎస్ఎంబీ 28. మరి ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ ను ఏ రేంజ్లో షేక్ చేస్తుందనేది చూడాలంటున్నారు సినీ జనాలు. ఎస్ఎస్ఎంబీ 28లో పూజాహెగ్డే ఫీ మేల్ లీడ్ రోల్ లో నటి స్తోంది. శ్రీలీల సెకండ్ హీరోయిన్గా మెరవనుంది. త్రివిక్రమ్ తొలిసారి ఎస్ఎస్ఎంబీ 28లో ఐటెంసాంగ్ పెట్టనున్నాడని వార్తలు వస్తుండగా.. దీనిపై క్లారిటీ వస్తుందేమో చూడాలి.
మహేశ్బాబు నటించిన దూకుడు, ఆగడు, సర్కారు వారి పాట సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ అందించిన ఎస్ థమన్ మరోసారి ఎస్ఎస్ఎంబీ 28కి సంగీతం అందిస్తున్నాడు.
Read Also :
Bhuvana Vijayam | ఇంట్రెస్టింగ్గా సునీల్ భువన విజయం ఫస్ట్ లుక్
Mahesh babu | సూపర్ యంగ్ లుక్లో మహేశ్ బాబు.. యాడ్ వీడియో వైరల్
Anikha Surendran | ఈ సారి కొంచెం హాట్గా.. అనిఖా సురేంద్రన్ ప్రమోషన్స్ స్టిల్స్ వైరల్