టాలీవుడ్ (Tollywood) స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) ప్రస్తుతం నందమూరి హీరో బాలకృష్ణ (Nandamuri Balakrishna)తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్బీకే 107వ (#nbk107) ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శృతిహాసన్ను హీరోయిన్గా ఫైనల్ చేసినట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. పవర్ ఫుల్ మాస్ ఎంటర్ టైనర్కు సంబంధించిన ఆసక్తికర వార్త ఇపుడు టాలీవుడ్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. రాయలసీమ బ్యాక్డ్రాప్లో వాస్తవ సంఘటనల ఆధారంగా రాబోతున్నట్టు ఇప్పటివరకున్న టాక్.
కాగా ఈ మూవీలో ప్రముఖ కన్నడ నటుడు దునియా విజయ్ (Duniya Vijay) ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. కన్నడలో మొదట విలన్గా ఫేమస్ అయిన దునియా విజయ్ ఆ తర్వాత లీడ్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇపుడీ క్రేజీ యాక్టర్ బాలకృష్ణతో ఫైట్ చేయబోతున్నాడన్న వార్తతో సినిమాపై క్యూరియాసిటీ మరింత పెరుగుతుంది.
అయితే మైత్రీ మూవీ మేకర్స్ ఈ విషయానికి సంబంధించి ఓ అధికారిక ప్రకటన ఇస్తే స్పష్టత రానుంది. సిల్వర్ స్క్రీన్పై టాలీవుడ్ హీరో, శాండల్ వుడ్ విలన్ కం హీరో ఒకరికొకరు తలపడతారా..? లేదా అన్నదానిపై త్వరలోనే క్లారిటీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు బాలకృష్ణ అభిమానులు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Rana: ఒక్క పోస్ట్తో ముగ్గురు సెలబ్రిటీలకు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపిన రానా
Kamal Hassan: తన బర్త్ డే సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ పెట్టిన కమల్ హాసన్
Pawan Kalyan: లాలా భీమ్లా సాంగ్ విడుదల.. పవన్ అభిమానులకి పూనకాలే..!