Poonam Pandey | చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్ వివాదాస్పద నటి, మోడల్ పూనమ్ పాండే (Poonam Pandey) మృతి చెందారు. పూనమ్ వయసు ప్రస్తుతం 32 ఏళ్లు. గత కొన్ని రోజులుగా గర్భాశయ క్యాన్సర్ (Cervical Cancer)తో బాధపడుతున్న పూనమ్ పాండే గురువారం రాత్రి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని పూనమ్ టీమ్ ధ్రువీకరించింది. ‘ఈ ఉదయం మాకు చాలా కఠినమైనది. గర్భాశయ క్యాన్సర్తో పూనమ్ పాండే మరణించారని తెలియజేయడానికి చాలా బాధపడుతున్నాము’ అని ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొంది.
ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు పూనమ్ మృతికి సంతాపం తెలుపుతూ సోషల్మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మోడల్గా కెరీర్ ప్రారంభించిన పూనమ్ పాండే.. 2013లో ‘నాషా’ (Nasha)తో బాలీవుడ్లోకి అడుగుపెట్టారు. సినిమాల కంటే ఆమె వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఎక్కువగా పబ్లిసిటీ పొందుతూ వచ్చారు. అప్పట్లో భారత్ వన్డే ప్రపంచకప్ గెలిస్తే నగ్నంగా స్టేడియంకి వస్తానని ప్రకటించిన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
Also Read..
Maldives | మాల్దీవులకు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చిన పాకిస్థాన్..!
Elephant | బందీపూర్ నేషనల్ పార్క్లో టూరిస్ట్లను వెంబడించిన ఏనుగు.. VIDEO
Arvind Kejriwal | ఈడీ విచారణకు కేజ్రీవాల్ ఐదో సారీ డుమ్మా