Poonam Kaur : తిరుపతి వేంకటేశ్వరస్వామి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయా అని, దేవుళ్లను రాజకీయం చేయవద్దని హెచ్చరించింది. అసలు ఆధారాలు లేకుండా, సిట్ విచారణ పూర్తికాకుండా మీడియా ముందుకు ఎందుకు వెళ్లారని ఏపీ సర్కారుపై ఫైర్ అయ్యింది. ఇది హిందువుల మనోభావాలను దెబ్బ తీసినట్లే అవుతుందని వ్యాఖ్యానించింది.
సుప్రీంకోర్టు సీరియస్ కావడంతో ఏపీ ప్రభుత్వం సైలెంట్ అయ్యింది. మొన్నటివరకు సనాతన ధర్మం అన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సైలెంట్ అవ్వడంతో.. ఆయనపై ట్రోల్స్ ఎక్కువయ్యాయి. ఇక ఇదే అదునుగా భావించిన పూనమ్ కౌర్.. మరోసారి పవన్ కళ్యాణ్ను కెలికే ప్రయత్నం చేసింది. తాజాగా వెంకటేశ్వరస్వామి ఫోటో వద్ద నిలబడి దండం పెట్టుకుంటున్న ఫోటోను షేర్ చేస్తూ.. ‘గోవిందా.. గోవిందా’ అని క్యాప్షన్ ఇచ్చింది.
అయితే ఇదేమి పూనమ్ భక్తి పారవశ్యంతో పెట్టిన ఫొటోలా అనిపించడం లేదు. తిరుపతి లడ్డూ వివాదంలో పవన్ చేసిన దానికి కౌంటర్గా చెప్పినట్లు కనిపిస్తుంది. అందుకే ఆ ట్వీట్ పరోక్షంగా పవన్ కల్యాణ్ పని గోవిందా అంటూ సెటైర్ వేసినట్లు ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పూనమ్ ఈ మధ్యనే త్రివిక్రమ్ తనను వేధించాడని మా అసోసియేషన్ లో ఫిర్యాదు చేస్తే తిరస్కరించినట్లు తెలిసింది. అయితే త్రివిక్రమ్ వేధించింధి పవన్ కోసమేనని టాలీవుడ్ గుసగుసలాడుతోంది.
పవన్ కళ్యాణ్ వల్లనే పూనమ్ కౌర్ కెరీర్ నాశనం అయ్యిందని టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. పవన్ తరుపున వకాల్తా పుచ్చుకొని త్రివిక్రమ్ ఆమెను వేధించాడని, అప్పటి నుంచి పూనమ్ కౌర్.. త్రివిక్రమ్ పైన, పవన్ పైన పీకల్లోతు కోపాన్ని పెంచుకుందని, ఆ కోపాన్నే సందు దొరికినప్పుడల్లా పూనమ్ ఇలా ప్రదర్శిస్తున్నదని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు పూనమ్ ఎన్ని అన్నా త్రివిక్రమ్ గానీ, పవన్ గానీ తిరిగి రిప్లై ఇవ్వడంలేదు.
#govinda Govinda 🙏 pic.twitter.com/vFPLJmhMPW
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) September 30, 2024