ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే..మరోవైపు తనకిష్టమైన వ్యాపకాలకు టైం కేటాయిస్తుంటుంది పూజాహెగ్డే (Pooja Hegde). ఎప్పుడూ ఏదో ఒక షూటింగ్ తో బిజీగా ఉండే ఈ భామ శివరాత్రి పర్వదినాన కాస్త బ్రేక్ తీసుకుంది. శివరాత్రి (Maha Shivratri) రోజు ప్రఖ్యాత క్షేత్రానికి వెళ్లింది. ఇంతకీ ఎక్కడికి వెళ్లిందనే కదా మీ డౌటు. ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసి (Varanasi)ని సందర్శించింది. తన కుటుంబసభ్యులతో కలిసి వారణాసి క్షేత్రంలో శివరాత్రిని సెలబ్రేట్ చేసుకుంది.
గంగా నదీ తీర ప్రాంతంలో బ్లూ డ్రెస్లో బుట్టబొమ్మలా కూర్చొని కెమెరాకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది. క్యూట్ క్యూట్ లుక్లో అదిరిపోయే అందంతో కండ్లు పక్కకు తిప్పుకోనీయకుండా చేస్తోంది. వారణాసిలో పూజాహెగ్డే దిగిన స్టిల్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. పూజాహెగ్డే ప్రస్తుతం యూనివర్సల్ లవ్ స్టోరీతో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ (Radhe Shyam)లో నటిస్తోంది. మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కానుంది.
Om Namah Shivaya 🙏🏻 May we be as fierce as Lord Shiva when it comes to our dreams and as benevolent as Him when it comes to forgiveness ❤️ pic.twitter.com/IMMWqTQZX5
— Pooja Hegde (@hegdepooja) March 1, 2022
మరోవైపు మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఆచార్యలో వన్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.దీంతోపాటు విజయ్తో చేస్తున్న బీస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా..హిందీలో సర్కస్ చిత్రంలో నటిస్తోంది.