Pawan Kalyan | అయోధ్య(Ayodhya)లో కౌసల్య రాముడు కొలువుదీరాడు. కొత్తగా నిర్మించిన ఆలయంలో బాలరాముడి(Ramlalla) విగ్రహాన్ని ప్రతిష్టించారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట జరిగింది. శ్రీ రామ జన్మభూమి రామమందిరంలో ఇవాళ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. కన్నుల పండువగా జరిగిన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్తోపాటు వివిధ ఇండస్ట్రీల ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో టాలీవుడ్ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆలయం ముందు దిగిన సెల్ఫీని ట్విట్టర్లో షేర్ చేస్తూ.. రామకార్యం అంటే రాజ్యకార్యం.. ప్రజాకార్యం.. జైశ్రీరామ్.. అంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడీ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. అంతకుముందు బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్తున్నా.. అంటూ దారిలో తీసిన వీడియోను పవన్ కల్యాణ్ ట్వీట్ చేయగా.. ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది.
పవన్కల్యాణ్ సెల్ఫీ..
రామకార్యం అంటే రాజ్య కార్యం
ప్రజా కార్యం…🙏 జై శ్రీ రామ్ pic.twitter.com/qkDGgRMWtZ— Pawan Kalyan (@PawanKalyan) January 22, 2024
అయోధ్యకు వెళ్తూ..
जय श्री राम ! 🙏
On the way to Ayodhya…
To witness ‘ Lord Rama’s Pran Prathishta..’
Lord Rama is the ‘Hero of our Bharat Civilisation.’And it took five centuries of struggle to bring back Lord Rama into ‘Ayodhya.’धर्मो रक्षति रक्षितः
ధర్మో రక్షతి రక్షితః.జై శ్రీ రామ్ !… pic.twitter.com/Sh0SP2a5qG
— Pawan Kalyan (@PawanKalyan) January 22, 2024
Read Also :